Medigadda Barrage: మేడిగడ్డకు కొత్త సమస్యలు
మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు.
ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీ బుంగ
మరికొన్ని చిన్నచిన్నవి కూడా
తాత్కాలిక మరమ్మతుల్లో వెలుగులోకి
పూడ్చివేసిన ఇంజినీరింగ్ అధికారులు
మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో 20 పియర్ వద్ద బయటపడిన బుంగ
ఈనాడు హైదరాబాద్; మహదేవపూర్, న్యూస్టుడే: మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్న చిన్నవి కనిపించగా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ నివేదిక అందుబాటులో లేదని తెలిసింది. ‘అసలు జీఎస్ఐతో సర్వే చేయించారా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు. కీలకమైన ఈ నివేదిక జీఎస్ఐ దగ్గర ఉంటే తీసుకొనే ప్రయత్నం చేస్తాం’ అని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వర్షాకాలంలోగా గేట్లన్నీ తెరిచి ఉంచాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్డీఎస్ఏ) సూచించగా, 8 గేట్లు పైకెత్తడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాతనే ఎలాంటి సమస్యలున్నాయి, ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు రావడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
20వ పియర్ ప్లాట్ఫాం ఎదుట....
మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా కుంగిన ఏడో బ్లాక్ వద్ద ఏరియా క్లియరెన్స్ పనులను చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్ ప్లాట్ఫాం ఎదుట పెద్ద బుంగ బయటపడింది. బుంగను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చేశారు. ఏడో బ్లాక్ ప్రదేశంలో పలు చోట్ల చిన్న బుంగలు ఏర్పడగా వాటిని కూడా పూడ్చేసినట్లు తెలిసింది. గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్ పైల్స్కు 20 మీటర్ల దూరంలో భారీ గొయ్యి బయటపడగా ఇసుక బస్తాలతో పూడ్చేశారు. అయితే ఇప్పుడు సీసీ బ్లాకులకు దగ్గరగా పెద్ద బుంగను గుర్తించారు. ఇన్వెస్టిగేషన్స్ పూర్తయితే కానీ వాటి తీవ్రత, ఏర్పడటానికి కారణం తెలియదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘బుంగలు పడటమంటే ఫాల్ట్జోన్ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. పైన అంతా ఇసుక గట్టిగానే ఉండి మధ్యలో నీటి ప్రవాహం ఉండటం, బర్రీడ్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో కూడా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో పేర్కొన్న ఐ.ఎస్.కోడ్లు నిర్మాణ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాల్లో లేవని, దానివల్ల నిర్మాణ సమయంలో ఈ పరీక్షలు చేసి ఉండకపోవచ్చని కూడా ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ల అమరిక పనులు
ఎనిమిది గేట్లు మినహా...
మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ సూచించింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఆరో బ్లాక్ వరకు, అలాగే ఎనిమిదో బ్లాక్లోను ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తి స్థాయి నీటిమట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించాలి. ఆరు ఎత్తాల్సి ఉంది. ఇందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎత్తడానికి వీలు లేకుంటే ఈ గేట్లను కూడా తొలగించాలి. ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ పైల్స్ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు. బోర్వెల్ డేటా కోసం డ్రిల్లింగ్ కూడా చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై జీతాలు ఇచ్చేదెలా!
57 మంది ఉద్యోగులు. ప్రతి నెలా వేతనాలకు కావాల్సిన నిధులు సుమారు రూ.55 లక్షలు. జూన్ గడిస్తే జులై ఒకటో తేదీన ఉద్యోగులకు అందజేయడానికి పైసలు లేవు. -
ఈ నెల 20 నుంచి గ్రూపు-4 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూపు-4 ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
నాలుగు నెలల్లో రూ.31.29 కోట్లు జమ!
కేవలం నాలుగు నెలల వ్యవధిలో బాధితులకు రూ.31.29 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో రికార్డు సృష్టించింది. -
వ్యవసాయశాఖను రైతు సంక్షేమశాఖగా మార్చాలి
వ్యవసాయశాఖను వ్యవసాయ, రైతు సంక్షేమశాఖగా మార్చాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. -
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
హైదరాబాద్ లోటస్ పాండ్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నివాసం ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం.. ఓ అధికారి బదిలీకి దారితీసింది. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ ముస్లింలందరూ ఆనందం, శాంతి, ఆరోగ్యంతో కూడిన బక్రీద్(ఈద్ ఉల్-అజ్ హా)ను జరుపుకోవాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. -
కేసీఆర్ లేఖపై సమీక్షిస్తాం: జస్టిస్ నరసింహారెడ్డి
విద్యుత్కేంద్రాల నిర్మాణం, కొనుగోళ్లపై విచారణ జరిపే అర్హత జ్యుడిషియల్ కమిషన్కు లేదని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సమీక్ష జరపనున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. -
ఆ ఆరోపణలు నిరాధారం: ఆర్టీసీ
ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్సీఎస్) అమలు విషయంలో భారాస చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆర్టీసీ పేర్కొంది. ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను అమలుచేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
కమిషన్ లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి: తమ్మినేని
విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఛైర్మన్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
గృహనిర్బంధంలో ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఆదివారం గృహనిర్బంధంలో ఉంచారు. -
పట్టాలెక్కని ప్రాజెక్టులు
రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి. -
వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సిట్ చేతికి సాంకేతిక ఆధారాలు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
కేసీఆర్కు న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుంది
‘‘విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జ్యుడిషియల్ విచారణకు రాబోమని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుంది. జస్టిస్ నరసింహారెడ్డి అనుభవం కలిగిన వారు. -
జులై ఆఖరులోగా తేల్చండి
విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్కేంద్రం కరెంటు కావాలా.. వద్దా.. అనేది జులై ఆఖరులోగా తేల్చిచెప్పాలని కేంద్ర విద్యుత్శాఖ కొత్త మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్ర విద్యుత్శాఖకు సూచించారు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష జరిగింది. -
సైబర్ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?
ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)