Medigadda: మేడిగడ్డ గేట్ల తొలగింపు పనుల ప్రారంభం
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు.
నాలుగింటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు
ఏడో బ్లాక్లోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు
మేడిగడ్డ బ్యారేజీ ఎగువన ఏడో బ్లాక్ 20 పియర్ ఎదుట బయటపడిన బుంగ వద్ద నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు
మహదేవపూర్, న్యూస్టుడే: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్.డి.ఎస్.ఎ.) సూచించింది. ఏడో బ్లాక్లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు ఉన్నారు. శనివారం 20వ గేటు కటింగ్ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
రోజుకో సమస్య..
మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో రోజుకో సమస్య ఎదురవుతోంది. మూసిఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో భాగంగా 15వ గేటును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తారు. 16వ గేటు ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయత్తం అవుతూనే.. ఏడో బ్లాక్ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు. శుక్రవారం పనులు చేస్తున్న క్రమంలో 20వ పియర్ వద్ద భారీ బుంగను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఇసుక, ఇసుక బస్తాలు వేసి పూడ్చివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు పూర్తిస్థాయి పరిశీలన, బుంగల సమస్య తీరేవరకు ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో పలు చిన్న చిన్న బుంగలు ఏర్పడగా.. వాటిని సైతం పూడ్చి వేశారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ల ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. ఏడో బ్లాక్ ప్రాంతంలోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు పనులు చేపట్టారు.
మేడిగడ్డ బ్యారేజీ దిగువన నీటి ఊటలు వస్తున్నట్లు భావిస్తున్న ప్రదేశం
అనధికార ఆంక్షలు!
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న రోజు నుంచి మీడియా, సామాన్య ప్రజలు లోపలికి వెళ్లకుండా ఆంక్షలు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాటిని ఎత్తివేసింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అనధికార ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా నిర్మాణ సంస్థ ప్రైవేటు సిబ్బంది ద్వారా కట్టడి చేస్తోంది. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన, ఆదేశాలు లేనప్పటికీ మేడిగడ్డ ప్రాంతంలో అనధికార ఆంక్షలు సాగుతున్నాయి.
గేటు తొలగించేందుకు కటింగ్ పనులు
సీకెంట్ పైల్స్ నిర్మాణంపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీని వరద ముప్పు నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాలపై జ్యుడిషియల్ కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ దృష్టి సారించింది. ఎన్.డి.ఎస్.ఎ. అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతలలోని మూడు బ్యారేజీల వద్ద పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్, ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ నేతృత్వంలో హైదరాబాద్లో శనివారం కమిటీ సమావేశమైంది. బ్యారేజీ పరిరక్షణ చర్యలపై చర్చించింది. ఎగువ భాగంలో సీకెంట్ పైల్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా వరద ముప్పు నుంచి బ్యారేజీకి రక్షణ ఉంటుందని, గేట్లు పూర్తిగా తెరిచి ఉంచాలని, గ్రౌటింగ్ పనులకు సంబంధించి ఎన్.డి.ఎస్.ఎ. కమిటీ అనుమతుల కోసం లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ను ఈ సమావేశానికి ఆహ్వానించి.. పలు సూచనలు తీసుకున్నారు. సమావేశంలో ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, సీడీవో సీఈ మోహన్ కుమార్, రామగుండం సీఈ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు
భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. -
ఖాళీల్లోనే ఆ పాఠశాలలు ఆదర్శం!
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. -
అంతిమ లబ్ధిదారులే కీలకం
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడుకు పరిహారం చెల్లించాల్సిందే
గ్యాస్ సిలిండర్ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. -
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఇన్ఛార్జి వీసీలే
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు. -
నిన్నటి మనస్తత్వంతో రేపటి పోరాటం చేయలేం
-
ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల ధర్నా
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నల్లమలలో చిరుత మృతి
నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. -
మొలకెత్తింది కష్టాలే
జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. -
బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి
ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి
కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. -
నియంతృత్వ, నిర్బంధ పోకడలు తగవు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
రమేశ్కార్తీక్ నాయక్ను వరించిన ‘యువ పురస్కార్’
ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. -
అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు
తెలంగాణలో వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!