Medigadda: మేడిగడ్డ గేట్ల తొలగింపు పనుల ప్రారంభం
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు.
నాలుగింటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు
ఏడో బ్లాక్లోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు
మేడిగడ్డ బ్యారేజీ ఎగువన ఏడో బ్లాక్ 20 పియర్ ఎదుట బయటపడిన బుంగ వద్ద నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు
మహదేవపూర్, న్యూస్టుడే: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్.డి.ఎస్.ఎ.) సూచించింది. ఏడో బ్లాక్లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు ఉన్నారు. శనివారం 20వ గేటు కటింగ్ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
రోజుకో సమస్య..
మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో రోజుకో సమస్య ఎదురవుతోంది. మూసిఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో భాగంగా 15వ గేటును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తారు. 16వ గేటు ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయత్తం అవుతూనే.. ఏడో బ్లాక్ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు. శుక్రవారం పనులు చేస్తున్న క్రమంలో 20వ పియర్ వద్ద భారీ బుంగను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఇసుక, ఇసుక బస్తాలు వేసి పూడ్చివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు పూర్తిస్థాయి పరిశీలన, బుంగల సమస్య తీరేవరకు ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో పలు చిన్న చిన్న బుంగలు ఏర్పడగా.. వాటిని సైతం పూడ్చి వేశారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ల ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. ఏడో బ్లాక్ ప్రాంతంలోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు పనులు చేపట్టారు.
మేడిగడ్డ బ్యారేజీ దిగువన నీటి ఊటలు వస్తున్నట్లు భావిస్తున్న ప్రదేశం
అనధికార ఆంక్షలు!
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న రోజు నుంచి మీడియా, సామాన్య ప్రజలు లోపలికి వెళ్లకుండా ఆంక్షలు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాటిని ఎత్తివేసింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అనధికార ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా నిర్మాణ సంస్థ ప్రైవేటు సిబ్బంది ద్వారా కట్టడి చేస్తోంది. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన, ఆదేశాలు లేనప్పటికీ మేడిగడ్డ ప్రాంతంలో అనధికార ఆంక్షలు సాగుతున్నాయి.
గేటు తొలగించేందుకు కటింగ్ పనులు
సీకెంట్ పైల్స్ నిర్మాణంపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీని వరద ముప్పు నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాలపై జ్యుడిషియల్ కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ దృష్టి సారించింది. ఎన్.డి.ఎస్.ఎ. అందించిన మధ్యంతర నివేదిక ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతలలోని మూడు బ్యారేజీల వద్ద పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్, ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ నేతృత్వంలో హైదరాబాద్లో శనివారం కమిటీ సమావేశమైంది. బ్యారేజీ పరిరక్షణ చర్యలపై చర్చించింది. ఎగువ భాగంలో సీకెంట్ పైల్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా వరద ముప్పు నుంచి బ్యారేజీకి రక్షణ ఉంటుందని, గేట్లు పూర్తిగా తెరిచి ఉంచాలని, గ్రౌటింగ్ పనులకు సంబంధించి ఎన్.డి.ఎస్.ఎ. కమిటీ అనుమతుల కోసం లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ను ఈ సమావేశానికి ఆహ్వానించి.. పలు సూచనలు తీసుకున్నారు. సమావేశంలో ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, సీడీవో సీఈ మోహన్ కుమార్, రామగుండం సీఈ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం