Thummala Nageswara Rao: జులై నుంచి రైతు భరోసా
శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.., వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
పంట వేసిన వారికే సాయం
కౌలుదార్లు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత
ఆరునూరైనా రుణమాఫీ ఖాయం
నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఈనాడు - హైదరాబాద్
శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.., వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసేవారందరికీ ‘రైతు భరోసా’ అమలు చేయనున్నామని, జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందిస్తామన్నారు. పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని తెలిపారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న, సన్నకారు రైతులందరికీ రుణసహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం కొన్నా.. కొనకపోయినా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునేలా పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని.. ఈ వానాకాలం నుంచి అమలు చేస్తుందని పేర్కొన్నారు. శనివారం ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
గత 5 నెలలుగా రైతు సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతీరోజు సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. మద్దతు ధరతో ధాన్యం, పలు ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టామని, వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వారికి రెండు నెలల్లోపే సాయం అందించామని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలివీ..
మీరు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎలా ఉంది?
మేం వచ్చేనాటికి వానాకాలం పంట ముగిసి యాసంగి మొదలైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. వర్షాకాలం పంటకు అప్పటి ప్రభుత్వం నీరివ్వలేదు. కొనుగోలుకు సైతం విద్యుత్ అందుబాటులో లేదు. కష్టమైనా సరే.. కరెంట్ కొనుగోలు చేసి పంటలు కాపాడాం. భూగర్భజలాలు అడుగంటిన చోట ఇబ్బంది ఏర్పడింది. అయినా గత యాసంగి కంటే ఈసారి ఎక్కువ పంటలు పండాయి. వానాకాలం పంటకు నీరివ్వకుండా భారాస నేతలు మామీద నెపం మోపారు. భూగర్భ జలాలున్నాయని పంటలు పండుతాయనే ఆశతో రైతులు సాగు చేసినా.. ఈసారి అవి తగ్గిపోయి చివరి భూములకు నీరందలేదు.
రైతుల కోసం భారీ హామీలిచ్చారు.. వాటి అమలు తీరు ఎలా ఉంది?
రైతులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీలిచ్చింది. వాటికి భారీగా నిధులు అవసరం. రూ.2 లక్షల రుణమాఫీకే రూ.40 వేల కోట్లకు పైగా కావాలి. ఎఫ్ఆర్బీఎం పరిమితి దృష్ట్యా రుణం రాదు. రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. వీటిని అధిగమించి రుణమాఫీ చేయాలి. రైతుభరోసా, పంటల బీమా విధివిధానాలపై దృష్టి సారించాం. ధాన్యానికి బోనస్ను ప్రకటించాం.
పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు కదా..?
భారాస ప్రభుత్వం రూ.లక్ష మాఫీయే సరిగా చేయలేదు. మేం రూ.2 లక్షల మాఫీ కచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం. ఒకే దఫా మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం చెప్పారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాం. దీంతోబాటు మార్గదర్శకాలు తయారుచేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగిశాక దీని కటాఫ్తేదీపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దీన్ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారు.
రైతుబంధును అయిదెకరాలలోపు వారికి ఇస్తామన్నారు. అందరికీ వేశారు. రైతుభరోసా అందరికీ వర్తింపచేస్తారా..?
సంక్షేమం నిరుపేదకు వెళ్లాలి. చేయూత అర్హులకు అందాలి. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధుకు ఆరేళ్లలో రూ.80,450 కోట్లు అందిస్తే.. అందులో పంటలు వేయని వారికి రూ.25 వేల కోట్లు ఇచ్చారు. రైతుభరోసా అయిదెకరాల్లోపు వారికి సాయం అందించాలనే సూచనలు వస్తున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న పథకం కాబట్టి దానిని యథాతథంగా అమలు చేద్దామని సీఎం చెప్పారు. రైతుభరోసాలో మార్పులు చేయాలనుకుంటున్నాం. ఎన్ని ఎకరాల వారికి వర్తింపచేయాలనే దానిపై మంత్రిమండలి నిర్ణయిస్తుంది. పరిమితి విధిస్తే భారీగా భూములున్న వారికి సాయం రాదు. నాకు కూడా సాయం అందదు. నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను.
పంటల బీమా అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయా..?
అకాల వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్లు, కరవు వల్ల పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేలా ఈ పథకం ఉంటుంది. పంట దిగుబడులు తగ్గినా, పంట వేయలేని పరిస్థితులున్నా సాయం అందాలి. ఈపథకానికి రూ.3500 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాం. దీనిపై టెండర్ డాక్యుమెంటు తయారవుతోంది. బీమా కంపెనీల కోసం కాకుండా రైతులకు మేలు జరిగేలా విధివిధానాలు ఉంటాయి. గతంలో అప్పు తీసుకున్న వారికే సాయం అందేది. ఇది బీమా కంపెనీలకు లాభం తెచ్చింది. కొత్త పథకం అలా ఉండదు. దీనిపై మేం పెట్టిన షరతులకు అంగీకరించే కంపెనీలనే ఎంపిక చేస్తాం.
వరికి బోనస్ ఇస్తామన్నారు.. కానీ సన్న రకాలకే ప్రకటించి, దొడ్డు వడ్లకు ఎందుకు మినహాయించారు..?
రాష్ట్రంలో భవిష్యత్లో సన్నరకం బియ్యం ఉత్పత్తి చేసి.. రేషన్షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. దీనికోసం వాటి ఉత్పత్తిని పెంచాలి. ఇందుకు పెట్టుబడి ఎక్కువవుతుంది. దిగుబడి తక్కువ వస్తుంది. దీంతో రైతులు సాగుకు వెనుకాడుతున్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందని దొడ్డు వడ్లనే వేస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రాథమికంగా సన్నవడ్లకు బోనస్ ప్రకటించాం. అవసరాన్నిబట్టి దొడ్లు వడ్లకూ వర్తింపజేస్తాం.
వానాకాలం సీజన్ సన్నద్ధత ఎలా ఉంది
రాష్ట్రంలో వ్యవసాయం సుసంపన్నం కావాలి. వానాకాలం సీజన్కు కార్యాచరణ సిద్ధం చేశాం. వర్షాలు బాగుంటాయని వాతావరణశాఖ నివేదించింది. నీటి సమస్య ఉండదు. విత్తనాలు, ఎరువులు సరిపడా ఉన్నాయి.
పంటల వైవిధ్యీకరణలో రాష్ట్రం వెనుకంజలో ఉంది కదా..?
రాష్ట్రంలో ఆయిల్పామ్, పప్పుదినుసులు, కూరగాయల వంటి ఉద్యాన పంటలకు బాగా డిమాండ్ ఉంది. ఏటా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పెంచాలని ప్రయత్నిస్తున్నాం. వరికి అనుకూలం కాని భూముల్లో మిగిలిన పంటలు వేయించాలని అధికారులను ఆదేశించాం.
నకిలీ విత్తనాల నియంత్రణ ఎందుకు సాధ్యం కావడం లేదు..?
నకిలీ విత్తనాల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. రోజువారీ దాడులు, తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. నకిలీ విత్తనాలు విక్రయించిన వారి లైసెన్స్లు రద్దు చేస్తున్నాం. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాం. పీడీ చట్టం ప్రయోగిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు పోలీసు, టాస్క్ఫోర్స్ యంత్రాంగం పనిచేస్తున్నాయి. రైతులు అధీకృత డీలర్ల వద్ద విత్తనాలు కొనాలి. వాటి బిల్లు తీసుకోవాలి. అది ఉంటే పంట నష్టపోయిన సందర్భంలో కంపెనీల నుంచి పరిహారం వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది. విత్తనాలకు డిమాండ్ను బట్టి వాటిని ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. విత్తనాల విక్రయాలపై రోజువారీ నిఘా ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీషాపు నుంచి ఆన్లైన్ నివేదికలను హైదరాబాద్కు పంపాలని ఆదేశించాం. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు లైసెన్సింగ్ విధానంలో మార్పులు చేయనున్నాం.
వానాకాలం సీజన్కు రైతు భరోసా ఇస్తారా?
మేం వచ్చేనాటికి రైతుబంధు అమల్లో ఉంది. దానిని కొనసాగించాం. వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేస్తాం. వాస్తవంగా పంట వేసుకున్న వారికే దీనిని ఇస్తాం. జూన్లో ఎన్నికల కోడ్ ముగియగానే.. దీనిపై అఖిలపక్షంతో పాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. శాసనసభలో, మంత్రిమండలిలో దీనిపై చర్చిస్తాం.
కౌలు రైతులు, రైతు కూలీలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు..?
పంట సాగుచేసిన వారికి రైతుభరోసా అందుతుంది. కౌలుదార్లు సాగు చేస్తే వారికే నిధులిస్తాం. మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. భూములను కౌలుకు తీసుకునే సమయంలో రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలుదార్లకే రైతుభరోసా సొమ్ము ఇస్తాం. రైతు కూలీల గుర్తింపు అంశాన్ని పంచాయతీరాజ్కు అప్పగించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం
మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను భావితరాలు గుర్తుంచుకునేలా వారి విగ్రహాలను ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం సర్వసాధారణమే. -
సైబర్ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?
ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. -
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్ మందుల వాడకం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్లోని సైన్ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ను రూపొందించాయి. -
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
హైదరాబాద్ లోటస్ పాండ్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నివాసం ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం.. ఓ అధికారి బదిలీకి దారితీసింది. -
పట్టాలెక్కని ప్రాజెక్టులు
రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి. -
వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సిట్ చేతికి సాంకేతిక ఆధారాలు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
జనం సొమ్ముతో... జగన్ మాయామహల్
అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం..! అయితే... -
నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట
వర్షాలు మొదలుకాగానే దోమల తాకిడి పెరుగుతుంది. వీటి బెడదను వదిలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. -
జాలిపడేలా కాదు.. ఈర్ష్యపడేలా ఎదగాలన్న రామోజీరావు
జాలిపడేలా కాకుండా ఎదుటివారు ఈర్ష్యపడేలా ఎదగాలన్న జీవిత సత్యాన్ని చెప్పి.. ఆచరించి చూపిన స్ఫూర్తిప్రదాత రామోజీరావు అని సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. -
రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు: ఈటల
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అరుదైన వ్యక్తి అని.. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని భాజపా ముఖ్య నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. -
భక్తజనంతో మురిసిన బాసర
దశమి, ఏకాదశి కలిసి రావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. -
పాస్బుక్లు, రేషన్కార్డులున్న వారికే రుణమాఫీ!
పంద్రాగస్టులోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
అధికారులను అవమానిస్తున్న కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి
జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం డిమాండ్ చేసింది. -
నేర చరిత్ర ఉన్నవారిని పనుల్లో పెట్టుకోకూడదు: మంత్రి శ్రీధర్బాబు
వలస కూలీల నియామకాల్లో పరిశ్రమల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. -
మేడిగడ్డలో భారీగా ఇసుక పూడిక
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. -
ఎస్సైలుగానే పుష్కరకాలం!
పోలీసుశాఖలో పదోన్నతుల ప్రక్రియ తరచూ చర్చనీయాంశమవుతోంది. నిన్నమొన్నటి వరకు పాత జోన్ల మధ్య వివాదాలు తలెత్తగా... ఇప్పుడు కొత్తగా మల్టీజోన్లు ఏర్పాటైనా వీటికి పరిష్కారం కనిపించడంలేదు. -
ఆగస్టులో ‘ఫాక్స్కాన్’ ఉత్పత్తులు షురూ!
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’ సంస్థ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఉత్పత్తులను ప్రారంభించనుంది. -
తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డా.బి.వి.పట్టాభిరాం
తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డాక్టర్ బి.వి.పట్టాభిరాం అని పలువురు వక్తలు కొనియాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప
-
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం