Uttam: నిర్మాణ సంస్థల ఖర్చులతోనే మరమ్మతులు
పూర్తిస్థాయిలో వర్షాలు, వరదలు వచ్చేలోపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పనులు పూర్తవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్మాణ సంస్థలను, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
సుందిళ్లలో ఆశించిన మేర లేని పనుల పురోగతి
వేగం పెంచాలని నిర్మాణ సంస్థను హెచ్చరించాం
ఈ ఏడాది కొత్తగా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక
మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
కాళేశ్వరం బ్యారేజీల పరిశీలన
దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ 20వ పియర్ వద్ద పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఈనాడు, పెద్దపల్లి; ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి; మహదేవపూర్, కాళేశ్వరం, మంథని గ్రామీణం, న్యూస్టుడే: పూర్తిస్థాయిలో వర్షాలు, వరదలు వచ్చేలోపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పనులు పూర్తవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్మాణ సంస్థలను, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వరుసగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన సుందిళ్ల, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించారు. అనంతరం మేడిగడ్డ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గతేడాది అక్టోబరులో మేడిగడ్డ కుంగింది. గత భారాస ప్రభుత్వం పట్టించుకుంటే ఇంత నష్టం జరిగేది కాదు. మేడిగడ్డను నిర్మించిన ఎల్అండ్టీ, అన్నారం నిర్మించిన ఆప్కాన్స్, సుందిళ్ల పనులు చేసిన నవయుగ సంస్థల ఖర్చులతోనే తాత్కాలిక మరమ్మతులు, పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించా. సుందిళ్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వేగం పెంచాలని నిర్మాణ సంస్థను హెచ్చరించా’ అని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రూ.94 వేల కోట్లతో నిర్మించిందన్నారు. ‘‘ఆయకట్టు స్థిరీకరణ పేరుతో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చింది. పాలమూరు రంగారెడ్డికి రూ.23 వేల కోట్లు, సీతారాంసాగర్ ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదు.
- తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు గ్రావిటీతో నీరందేది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి విద్యుత్తు ఖర్చు రూ.వెయ్యి కోట్లు.. కాళేశ్వరానికి రూ.10 వేల కోట్లు భారం పడుతుంది.
- కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని అప్పటి జలనవనరులశాఖ మంత్రి షెకావత్ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. జాతీయ హోదా ఇవ్వడం కుదరదని ప్రాజెక్టుకయ్యే 60% నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
- రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తాం. ఈ ఏడాది కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు. భూపాలపల్లి, రామగుండం, ధర్మపురి ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, మక్కాన్సింగ్ ఠాకూర్, లక్ష్మణ్రావు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఈఎన్సీ అనిల్కుమార్ పాల్గొన్నారు.
బ్యారేజీల పరిశీలన ఇలా..
మంత్రి ఉత్తమ్ సుందిళ్లలో ఆశించిన మేర పనుల పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరుద్ధరణ పనుల్లో అలసత్వం, నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ‘అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగంగా పూర్తి చేయండి. ఏ పని ఎప్పటి వరకూ పూర్తవుతుందో షెడ్యూల్ రూపొందించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వండి’ అని ఇంజినీర్లకు స్పష్టం చేశారు. రాబోయే పది రోజుల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని ఈఎన్సీ అనిల్కుమార్ మంత్రికి తెలియజేశారు. అన్నారం బ్యారేజీలో సీపేజీలు ఎక్కడ జరిగాయని అధికారులను మంత్రి ప్రశ్నించారు. మూడు ప్రాంతాలలో సీపేజీలు ఏర్పడ్డాయని.. ముందుగా రసాయన పదార్థాలతో నియంత్రించామని తిరిగి సిమెంట్ గ్రౌటింగ్ చేపట్టినట్లు వారు వివరించారు. మేడిగడ్డలో ఎగువ, దిగువ భాగాన కాలినడకన సాగుతూ 7వ బ్లాక్లో పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన 20వ పియర్ను చూసి అక్కడ చేస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు.
ఏళ్లుగా గోస పడుతున్నాం...
సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్హౌస్ల నిర్మాణంతో ఏళ్లుగా గోస పడుతున్నామని మంథని మండలం సిరిపురం, ఉప్పట్ల, గుంజపడుగు గ్రామస్థులు కొద్దిసేపు ఆందోళన చేశారు. సుందిళ్ల వద్ద మంత్రి హెలిప్యాడ్ వద్ద దిగి వాహనాల కాన్వాయ్లో ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్నప్పుడు ప్రజలు రహదారిపై బైఠాయించగా పోలీసులు చెదరగొట్టారు. సిరిపురం రైతు ఇసంపల్లి శ్రీనివాస్ ప్రాజెక్టు ముఖద్వారం వద్ద బైఠాయించి తమ సమస్యలు మంత్రి వినాల్సిందేని భీష్మించడంతో పోలీసులు ఆయనను ఉత్తమ్ వద్దకు తీసుకెళ్లారు. మంత్రి.. శ్రీనివాస్తో మాట్లాడి ఆయన చెప్పిన ముంపు ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి మరోమారు ముంపు గ్రామాల ప్రజలకు సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి