బడి బస్సులు ఎంత భద్రం?
రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. రవాణాశాఖ అధికారుల లెక్కల మేరకు బడి బస్సుల్లో 60 శాతం మాత్రమే ఫిట్గా ఉన్నాయి.
కనిపించని ప్రథమ చికిత్స కిట్లు
అరిగిపోయిన టైర్లు, పగిలిన అద్దాలు
రాష్ట్రంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులు 9,654
ఈనాడు, హైదరాబాద్
ఖమ్మంలో బస్సులోకి వెళ్లి పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు
రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. రవాణాశాఖ అధికారుల లెక్కల మేరకు బడి బస్సుల్లో 60 శాతం మాత్రమే ఫిట్గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,824 విద్యాసంస్థల బస్సులు ఉంటే.. 9,654 బస్సులు ఇంకా సామర్థ్య(ఫిట్నెస్) ధ్రువీకరణ పత్రాలు పొందలేదు. ఇందులో మూడింట రెండొంతులకుపైగా జీహెచ్ఎంసీ వెలుపల తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. వేలాది బస్సులు ఫిట్నెస్ పరీక్షలో పాస్ కాని నేపథ్యంలో వాటిలో విద్యార్థుల ప్రయాణం ఎంత మేరకు భద్రం అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలోని ఓ బడి బస్సులో మందులు లేకుండా ఖాళీగా ఉన్న ప్రథమ చికిత్స పెట్టె
ఎన్నెన్నో లోపాలు
యాజమాన్యాలు తమ బస్సుల్ని రవాణా శాఖ కార్యాలయాలకు పంపిస్తున్నాయి. వాటిలో భూతద్దం పెట్టి వెతికినా ప్రథమ చికిత్స(ఫస్ట్ ఎయిడ్) కిట్లు కనిపించడం లేదు. ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్న 90శాతం బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. కొత్తగా కొనుగోలు చేసిన వాటిలో మాత్రమే ఈ కిట్లు ఉంటున్నాయి. ఫిట్నెస్ను పరిశీలించే విధానం గతంలో కొంటే కొంత మెరుగుపడినా అనేక లోపాలున్నాయి. ప్రతి దాన్ని స్వయంగా నడిపి పరీక్షించాలి. కానీ ఒక్కో విద్యాసంస్థకు సంబంధించి పదుల సంఖ్యలో వాహనాలుంటే పలు రవాణా కార్యాలయాల్లో కొన్నింటినే పరిశీలిస్తున్నారు. ఎక్కువ లోపాలు ఉన్నవాటికి మాత్రం సర్టిఫికెట్లు నిరాకరిస్తున్నారు. సామర్థ్య పరీక్షకు వస్తున్న బస్సుల్లో కొన్ని అరిగిన టైర్లతో వస్తుంటే.. మరికొన్ని పగిలిన అద్దాలతో... ఇంకొన్నింట్లో పిల్లలు ఎక్కే మెట్లు జారేలా ఉండటం.. ఇండికేటర్లు సరిగా లేకపోవడం, వెనకభాగంలో రేడియం స్టిక్కర్లు లేకపోవడం వంటి లోపాలున్నాయి.
జిల్లాల వారీగా పరిస్థితులు..
- హనుమకొండ జిల్లాలో 1058 విద్యా సంస్థల బస్సులుంటే ధ్రువీకరణ పత్రం పొందినవి 798 మాత్రమే. 149 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ నిరాకరిస్తూ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. మిగిలినవి కార్యాలయాలకే తీసుకురాలేదు.
- మహబూబ్నగర్ జిల్లాలో 439 ఉంటే 226 ఫిట్నెస్ పరీక్షలో పాస్ కాగా, 22 వాహనాలకు సర్టిఫికెట్ తిరస్కరించారు. 191 పరీక్షకే తీసుకురాలేదు.
- ఖమ్మం జిల్లాలో 648 బడి, కళాశాల బస్సుల్లో ఏకంగా 344 ఫిట్నెస్ పరీక్షకే రాలేదు. ఫిట్నెస్ సాధించినవి 284.
- మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మొత్తం 262, 140, 784, 465, 238 చొప్పున బడి బస్సులుంటే ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో ఫిట్నెస్ సాధించినవి 70, 40, 479, 293, 82 మాత్రమే.
15 ఏళ్లు దాటిన బస్సులూ అధికమే
ఒక వాహనం జీవితకాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత స్క్రాప్గా మార్చాలి. కానీ పలు జిల్లాల్లో యాజమాన్యాలు కాలం చెల్లిన డొక్కు బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేయించి నడిపిస్తూ పిల్లల భద్రతతో చెలగాటం ఆడుతున్నాయి. ఇలాంటి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ వాటిని తిరగకుండా ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కార్యాచరణలో కనిపించడం లేదు.
కరీంనగర్ జిల్లాలోనే 15 ఏళ్లు దాటిన డొక్కు బస్సులు 450 ఉన్నట్లు సమాచారం. జగిత్యాలలో 235, పెద్దపల్లిలో 18, సిరిసిల్లలో 22 ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో మొత్తం 1,637 బస్సులుంటే 15 ఏళ్లు దాటిన వాటి సంఖ్య ఏకంగా 725. అంటే 44 శాతం.
12 నుంచి ప్రత్యేక డ్రైవ్
విద్యాసంస్థల బస్సులకు 12వ తేదీ నుంచి ప్రత్యేకడ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఫిట్నెస్ లేకుండా రోడ్డు ఎక్కే వాటిని తనిఖీ చేసి జరిమానా వేస్తామని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఏటా పాఠశాలల ప్రారంభంలో కొద్దిరోజులు మాత్రమే ఓ తంతుగా సాగుతోంది. ఈసారి నిబంధనల్ని ఎలా అమలుచేస్తారన్నది చూడాలి. మరోవైపు కొన్ని విద్యాసంస్థలు వ్యూహాత్మకంగానే ఇప్పటివరకు తమ వాహనాలను ఫిట్నెస్ పరీక్షకు పంపలేదన్న అనుమానాలున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందు పంపిస్తే.. ఒకేసారి వేలాదిగా వెళ్తే అధికారులు పైపైనే పరీక్షలు చేస్తారన్న వ్యూహంతో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫిట్నెస్ ఎలా ఉందంటే..?
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి.. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12,631 బస్సులున్నాయి. ఇక్కడ పరిస్థితి జిల్లాల కంటే కొంత మెరుగ్గా ఉంది. ఈ మూడు జిల్లాల్లో ఫిట్నెస్ పొందినవాటి సంఖ్య 9,488. సర్టిఫికెట్ లేనివి 3,143 ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్