LLM: రాజ్యాంగంపై తెలుగులో ఎల్ఎల్ఎం
పోటీ ప్రపంచానికి దీటుగా సరికొత్త కోర్సులు... ఒప్పందాలతో న్యాయ విద్యలో ఉన్న అన్ని అవకాశాలను, పరిశోధనలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నల్సార్ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణదేవరావు చెప్పారు.
దేశంలో తొలిసారిగా రెండేళ్ల ఆన్లైన్ కోర్సు
త్వరలో డిగ్రీలో మూడేళ్ల లా కోర్సు తీసుకొస్తాం
స్థిరాస్తి రంగంపై మాస్టర్ డిగ్రీ
ఈనాడుతో నల్సార్ వీసీ శ్రీకృష్ణదేవరావు
ఈనాడు, హైదరాబాద్: పోటీ ప్రపంచానికి దీటుగా సరికొత్త కోర్సులు... ఒప్పందాలతో న్యాయ విద్యలో ఉన్న అన్ని అవకాశాలను, పరిశోధనలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నల్సార్ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. క్షేత్రస్థాయిలో కూడా అనుభవం గడించేలా లా డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు అవసరం అని...అందులో భాగంగా న్యాయ విద్యలో పలు సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని కొత్త కోర్సులు పెడుతున్నట్లు తెలిపారు. ‘రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి దేశంలో మొదటిసారి తెలుగులో రాజ్యాంగంపై రెండేళ్ల ఎల్ఎల్ఎం ఆన్లైన్ కోర్సు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడేళ్ల లా డిగ్రీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకోసం సిటీలో కార్యాలయం ఏర్పాటుకు భవన వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. అన్నీ అనుకూలిస్తే 2025లో ప్రారంభిస్తాం’ అని చెప్పారు. న్యాయవిద్యలో వస్తున్న మార్పులు, కొత్త కోర్సులు తదితర అంశాలను ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
నిర్మాణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో న్యాయ విద్యలో మార్పులపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
జ: రియల్ ఎస్టేట్కు సంబంధించి ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నాం. న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్), కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (సీడీఐ)తో కలిపి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ కోర్సును ప్రారంభించాలనుకుంటున్నాం. రెరాతో ఒప్పందం చేసుకోబోతున్నాం. ఎల్ఎల్ఎం ఇన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ పేరు మీద కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కోర్సు ప్రారంభిస్తున్నాం. ఒక ఏడాది ఇక్కడ, మరో ఏడాది దిల్లీలో చదువు కోవాల్సి ఉంటుంది. డ్యుయల్ డిగ్రీ అన్నది మొదట ఇక్కడే ప్రారంభిస్తున్నాం.
ఏడీఆర్ (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్)కు సంబంధించి యూనివర్సిటీ చర్యలు ఏమిటి ?
జ: ఆర్బిట్రేషన్పై కొత్తగా యూనివర్సిటీలో కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింగ్టన్ నారీమన్ నేతృత్వం వహిస్తుండటం గొప్ప విషయం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గౌరవ్ బెనర్జీ తన తండ్రి పేరుతో ‘మిలన్ కె.బెనర్జీ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా’ను నల్సార్తో కలిసి ఏర్పాటు చేస్తూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)తోనూ ఒప్పందం ఉంది. నల్సార్తో కలిపి ఎల్ఎల్ఎం ఇన్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ కోర్సు, ఎల్ఎల్ఎం క్రిమినల్ జస్టిస్ కోర్సు ప్రారంభానికి యూకే, యూఎస్ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయి వివాదాల పరిష్కారంలో యూనివర్సిటీ దృక్కోణం ఎలా ఉంది?
జ:సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవన్రెడ్డి సౌజన్యంతో ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మాజీ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సౌజన్యంతో ఏర్పాటైన సార్క్లా కేంద్రాన్ని ఆధునికీకరిస్తున్నాం. ఈ కేంద్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలో సేవలు అందించనుంది. ఏవియేషన్ లాపై కోర్సు కొనసాగుతోంది. సముద్ర జలాల వివాదంపై కోర్సును ఇంకా ప్రారంభించలేదు.
విద్యార్థులకు సైబర్ లాలో ప్రత్యేక శిక్షణ ఏమైనా ఇస్తున్నారా?
జ: హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, ట్రూత్ల్యాబ్స్తో కలిపి సైబర్ లా కోర్సులు అందిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లకు అనుగుణంగా కోర్సును తీర్చిదిద్దుతున్నాం. సెంటర్ ఫర్ డ్రగ్, సైబర్ క్రైం ఇన్స్టిట్యూట్లతో కలిపి ప్రాక్టికల్, థియరీ ఉండేలా చూస్తున్నాం. థియరీ, లాకు సంబంధించిన అంశాలను యూనివర్సిటీ బోధిస్తే, క్షేత్రస్థాయిలో మెలకువలను ఆ సంస్థల ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది.
వర్సిటీలో ప్రాంగణ నియామకాలకు ఉన్న అవకాశాలు ఏమిటి?
జ: నల్సార్లో దాదాపుగా 100 శాతం ప్రాంగణ నియామకాలు ఉంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని పలు కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు దక్కుతున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో ఐదారేళ్లు పనిచేసి అనుభవం గడించాక న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు. భవిష్యత్తులో హైకోర్టు న్యాయమూర్తులుగానూ మా విద్యార్థులు ఉంటారు.
నల్సార్లో విద్య కేవలం ఉన్నతాదాయ వర్గాలకే పరిమితమా?
జ: నల్సార్లో ఫీజు కాస్త ఎక్కువ ఉండటంతో ఉన్నతాదాయ వర్గాలకే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్లాట్లో మెరిట్ సాధించి సీటు పొందితే ఫీజు చెల్లించలేక చదువు ఆపేసిన విద్యార్థులు లేరు. అలాంటివారికి యూనివర్సిటీ అండగా ఉంటూ స్కాలర్షిప్లను అందజేస్తుంది. వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి అర్హులైన వారికి ఫీజు రాయితీ కల్పిస్తాం.
పాత తీర్పులకు భిన్నంగా ఉన్న జడ్జిమెంట్లకు సంబంధించి బోధన ఎలా ఉంటుంది?
జ: తరగతి గదిలో కేసు ఆధారిత అధ్యయనం జరుగుతుంది. పాత, కొత్త తీర్పులపై చర్చ ఉంటుంది. విద్యార్థులకు కోర్టులో మాదిరి వాద ప్రతివాదాలకు అవకాశం కల్పిస్తాం.
కాలేజీలో చేరి నేరుగా చదువుకోలేనివారికి ఏవైనా కోర్సులున్నాయా?
జ: ప్రస్తుతం 25 దూరవిద్య కోర్సులు ఉన్నాయి. త్వరలో మరో 10 ప్రారంభించనున్నాం. ఫార్మా రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మసీ, డ్రగ్ రెగ్యులేటరీపై ఇప్పటిదాకా కోర్సు ఇంకా ప్రారంభం కాలేదు. దీనిపై కసరత్తు ప్రారంభించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం