Narayanpet - kodangal Lift Irrigation Scheme: ‘నారాయణపేట-కొడంగల్’పై లైడార్ సర్వే పూర్తి
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన లైడార్ సర్వే పూర్తయింది. హెలికాప్టర్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో నీటిని తీసుకునే స్థానం నుంచి సరఫరా చేసే చివరి పాయింట్ వరకు సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేశారు.
డీపీఆర్.. పర్యావరణ అనుమతులకు డేటా మదింపు
జలాశయాల సామర్థ్యం 3.50 టీఎంసీలకు పెంపు
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని అందించనున్న భూత్పూర్ జలాశయం
ఈనాడు, హైదరాబాద్: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన లైడార్ సర్వే పూర్తయింది. హెలికాప్టర్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో నీటిని తీసుకునే స్థానం నుంచి సరఫరా చేసే చివరి పాయింట్ వరకు సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్రెడ్డి లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి భీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయం నుంచి నీటిని తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం రూపుదిద్దుకోగా 2014లో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రక్రియలో వేగం పుంజుకుంది. మొదట... నాలుగు దశల్లో కృష్ణా జలాలను ఎత్తిపోసి, ఏడు టీఎంసీలను లక్ష ఎకరాలకు ఇవ్వాలని అనుకున్నారు. భూసేకరణ సమస్యలు వస్తాయనే ఆలోచనతో ప్రస్తుతం... మూడు దశల్లోనే చేపట్టాలని, భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్ నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 10 చెరువులకు నీటిని మళ్లించాల్సి ఉండగా వాటి సామర్థ్యాన్ని 0.9 టీఎంసీల నుంచి 2.1 టీఎంసీకి పెంచాలని మొదట్లో నిర్ణయించారు. తాజాగా 3.6 టీఎంసీల నిల్వకు వీలుగా జలాశయాలను సిద్ధం చేసేలా అంచనా వేస్తున్నారు.
డీపీఆర్ రూపకల్పనకు కసరత్తు
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లోని వివిధ ప్యాకేజీలకు సర్వే నిర్వహించిన సంస్థే నారాయణపేట-కొడంగల్ పథకం సర్వేను చేపట్టింది. తాజాగా లైడర్ సర్వే పూర్తి చేయగా గుర్తించిన అంశాల(డేటా) మదింపు చేపడుతున్నారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పొందాల్సిన పర్యావరణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
- మూడు దశల ఎత్తిపోతల్లో 208 మెగావాట్ల సామర్థ్యమున్న ఏడు పంపులు (మొదటి పాయింట్లో ఒకటి) వినియోగిస్తారు.
- పథకం అంచనాల్లో భూగర్భ సొరంగాలు ఉన్నప్పుడు పంపులు, విద్యుత్ సబ్స్టేషన్లు ఇతరత్రా కలుపుకొని రూ.496 కోట్ల అంచనా వ్యయం ఉండగా ప్రెషర్ మెయిన్కు మారిన తర్వాత రూ.920 కోట్ల వరకు అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
- ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి సాంకేతిక అనుమతుల దస్త్రం నీటిపారుదల శాఖ వద్ద పరిశీలనలో ఉంది.
రూ.1,894 కోట్ల టెండర్లు పిలిచి వెనక్కి
ఎత్తిపోతల పథకంలోని వివిధ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నీటిపారుదల శాఖ మొదటిసారి టెండర్లు పిలిచింది. ప్రధాన పనులకు రూ.1,894 కోట్లకు టెండర్ ప్రకటన జారీ చేసినప్పటికీ తర్వాత... వెనక్కి తీసుకుంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. సాంకేతిక అనుమతులు రాకపోవడం కూడా టెండర్ల వాయిదాకు కారణమని తెలిసింది. త్వరలో మరోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి