Phone Tapping Case: 4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి వరకు నాలుగు నెలల కాలంలోనే 1,300 ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. అంటే రోజుకు సగటున పదికిపైగా ఫోన్లపై నిఘా ఉంచినట్లు తేలింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబరు నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీన్నిబట్టి శాసనసభ ఎన్నికల్లో భారాసకు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు బృందం శ్రద్ధ వహించినట్లు వెల్లడవుతోంది. శాసనసభ ఎన్నికలు నవంబరు 30న జరిగిన సంగతి తెలిసిందే. అలా ఎన్నికలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ సైతం ఆగిపోయినట్లు గుర్తించారు. భారాస అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం.. వారి అనుచరుల కార్యకలాపాల్ని పసిగట్టడం.. వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం.. వీలు కుదిరితే భారాసకు అనుకూలంగా మార్చడం.. లాంటి వ్యవహారాలపై ప్రభాకర్రావు బృందం దృష్టి పెట్టినట్లు తేలింది. పలు చోట్ల భారాస ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయించగలిగినట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా శివార్లలో రూ.కోట్ల సొమ్మును పట్టుకున్నారు.
1,300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడి కావడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారమిస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా జరిగిన నష్టం గురించి బాధితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించినా వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంది. ఇందులో బాధితుల వాంగ్మూలాలే కీలకం కావడంతో ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం
కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాగితాలు దాటని ఆదేశాలు.. ముంపు ముప్పులోనే పట్టణాలు
గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 193 కాలనీలు నీట మునిగాయి.. వేల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. నీట మునిగిన కాలనీల నుంచి నాలుగైదు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
మనబడికి సౌరకాంతులేవీ?
‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సౌరఫలకాల ఏర్పాటు అర్ధంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో మూడో వంతు పనులు కాగానే నిధుల్లేవని పనులు ఆపేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?