Phone Tapping Case: 1,200 ఫోన్లు ట్యాప్ చేశాం
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వాళ్ల మాటలు రహస్యంగా విన్నాం
డిసెంబరు 4న ఎస్ఐబీలోని ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశాం
‘ఫోన్ ట్యాపింగ్’ కేసులో నిందితుడు ప్రణీత్రావు వాంగ్మూలం
తానొక్కడినే 8 ఫోన్ నంబర్లు వినియోగించినట్లు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబరు 4న రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు ఎస్ఐబీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేసినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు, సస్పెండైన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం.. ‘‘ఎన్నికలు జరిగిన గతేడాది నవంబరు 30న ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాపింగ్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు ఆదేశించారు. ఎన్నికల్లో భారాస ఓడిపోవడంతో డిసెంబరు 4న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కార్యాలయం నుంచి వెళ్లిపోయే ముందు ఆధారాల్ని చెరిపేయాలని ఆయన ఆదేశించడంతో కంప్యూటర్లు, సర్వర్లలోని ఆధారాల్ని ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. అదేరోజు రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆపేయాలని ఆర్ఎస్ఐ అనిల్కుమార్కు సూచించాను. అందుకు ఆయన తొలుత నిరాకరించారు. ఆ విషయాన్ని ప్రభాకర్రావుకు చెప్పా. దీంతో తన ఆదేశాలను అమలు చేయాలని ప్రభాకర్రావు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు.. అనిల్కుమార్ రాత్రి 7.30 గంటల సమయంలో సీసీ కెమెరాలను ఆపేశారు. అనంతరం కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్లకు సంబంధించిన 50 హార్డ్ డిస్క్లను ఆర్ఎస్ఐ హరికృష్ణ తొలగించారు. అదే సమయంలో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి శ్రీనివాస్, అనంత్లతో పాటు మరో వ్యక్తి ఎస్ఐబీకి వచ్చి.. కొత్త సర్వర్లను, హార్డ్ డిస్క్లను ఇచ్చారు. వీటిని పాత వాటి స్థానంలో అమర్చాం. పాతవాటిని హెడ్కానిస్టేబుల్ కృష్ణ ఎలక్ట్రికల్ కట్టర్తో కట్ చేశారు. అనంతరం ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను బయటపడేశాం. నా సెల్ఫోన్లు, ల్యాప్టాప్ను ఫార్మాట్ చేశాను. పెన్డ్రైవ్లనూ పారేశాను. అదే నెల 13న ప్రభుత్వం నన్ను ఎస్ఐబీ నుంచి రిలీవ్ చేసి.. డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసింది. అనంతరం సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా బదిలీ చేసింది’’ అని తన వాంగ్మూలంలో ప్రణీత్రావు పేర్కొన్నారు.
1000-1200 ప్రొఫైళ్లు రూపొందించాం
‘‘ఎస్ఐబీలో స్పెషల్ టాస్క్ల కోసం ఇద్దరేసి చొప్పున ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లతో బృందం ఏర్పాటు చేశాం. కోదాడకు చెందిన గుండు వెంకటేశ్వరరావు మా సామాజికవర్గానికే చెందిన ఇన్స్పెక్టర్ కావడంతో ప్రభాకర్రావు సహకారంతో ఇంటెలిజెన్స్లోకి తీసుకొచ్చాం. ఏపీలోని కైకలూరుకు చెందిన ఇన్స్పెక్టర్ బాలే రవికిరణ్ నా బాల్య స్నేహితుడు కావడంతో అతడినీ తీసుకున్నాం. నమ్మకస్థులైన ఎస్సైలు హనుమంతరావు, శ్రీనివాస్.. ఏఎస్సైలు బ్రహ్మచారి, మాధవరావు.. హెడ్కానిస్టేబుళ్లు యాదయ్య, రఫీ.. కానిస్టేబుళ్లు హరీశ్, సందీప్, మధూకర్రావులను మా బృందంలోకి తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.
మా బ్యాచ్లో నాకొక్కడికే పదోన్నతి
‘‘నేను 2007లో ఎస్సైగా పోలీస్శాఖలో చేరాను. 2008 నవంబరులో నల్గొండ జిల్లా మోత్కూరు ఠాణాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాను. అధికార దుర్వినియోగం వ్యవహారంలో అప్పటి ఎస్పీ రాజేశ్కుమార్ నాపై క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. నల్గొండ ఎస్పీగా ప్రభాకర్రావు వచ్చాక.. సామాజిక సమీకరణలో భాగంగా బీబీనగర్ ఎస్సైగా అవకాశమిచ్చారు. అప్పటి నుంచి ఆయనతో సంబంధాలు పెరిగాయి. 2016లో ప్రభాకర్రావు ఇంటెలిజెన్స్లోకి వెళ్లాక ఆయన్ని కలిసి నేనూ అక్కడే చేరాను. మొదట్లో ఇంటెలిజెన్స్లో నాకు ఎలాంటి పని అప్పగించలేదు. తర్వాత ఎస్ఐబీలో పోస్టింగ్ ఇచ్చినా.. ఇంటెలిజెన్స్లోనే ప్రభాకర్రావు సూచించిన పనిచేసేవాడిని. సీనియారిటీ ప్రాతిపదికన 2017 డిసెంబరు 29న ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. ప్రభాకర్రావు ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్ అయ్యాక నన్ను మళ్లీ ఎస్ఐబీలోకి తీసుకున్నారు. 2021లో నాకు డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించాలని ప్రభాకర్రావు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ, అది తిరస్కరణకు గురైంది. 2022 డిసెంబరులో ప్రభాకర్రావు మరోసారి ప్రతిపాదించడంతో నాకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. మా బ్యాచ్ మొత్తంలో డీఎస్పీగా పదోన్నతి పొందింది నేనొక్కడినే’’ అని ప్రణీత్రావు పేర్కొన్నారు.
ఎస్ఐబీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రభాకర్రావు ఛాంబర్ పక్కనే మాకు రెండు గదుల్ని కేటాయించారు. అంతకుముందెన్నడూ లేని స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్వోటీ) పేరుతో మమ్మల్ని పిలిచేవారు. హైదరాబాద్కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సమకూర్చిన టూల్స్తో రాజకీయ నేతల ప్రొఫైళ్లను రూపొందించడం.. భారాస ప్రత్యర్థులపై నిఘా ఉంచడం మా పని. 17 కంప్యూటర్లతోపాటు ఒక ల్యాప్టాప్, కొన్ని పెన్డ్రైవ్లు తీసుకున్నాం. మాకు ప్రత్యేక ఇంటర్నెట్ లీజ్డ్ లైన్ ఉండేది. ప్రత్యేక మెయిల్ ఐడీ, రిక్వెస్ట్ ఐడీల ద్వారా కాల్ డేటా రికార్డర్(సీడీఆర్), ఐఎంఈఐ, లొకేషన్ల సమాచార సేకరణకు అనుమతి పొందేవాళ్లం. 1000-1200 మంది ప్రొఫైళ్లు రూపొందించి.. వారి సంభాషణలను రహస్యంగా విన్నాం. నాకు ఎస్ఐబీ నుంచి అధికారికంగా మూడు ఫోన్ నంబర్లుండేవి. సొంతంగా మరో ఐదు నంబర్లు వినియోగించాను.
వాంగ్మూలంలో ప్రణీత్రావు
భుజంగరావు, తిరుపతన్నల బెయిల్పై విచారణ వాయిదా
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ల విచారణను నాంపల్లి కోర్టు జూన్ 3కి వాయిదా వేసింది. కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నామని.. బెయిల్ మంజూరు చేయాలంటూ అదనపు ఎస్పీ భుజంగరావు, అదనపు డీసీపీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. వీటిపై కౌంటర్లు దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వీళ్లిద్దరూ ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించారని పోలీసులు వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు గతంలో వేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయగా తాజాగా మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్రావు తనకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారించిన న్యాయస్థానం ఆయన కుమార్తె లేదా డ్రైవర్ భోజనం అందించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈయన చంచల్గూడ జైలులో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్