Yadadri Power Plant: ‘కొలువుల’ వెలుగులు ఎన్నడో?!
యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణంలో స్థలాలు, ఇళ్లు, పొలాలు సహా సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఆసరా కరవైంది. 2017లో ప్రారంభమైన ప్లాంటు నిర్మాణం 2021కల్లా పూర్తి కావాల్సి ఉంది. కానీ, నిర్మాణంలో తీవ్ర జాప్యం నిర్వాసితులకు శాపంగా మారింది.
‘యాదాద్రి’ విద్యుత్కేంద్రం నిర్మాణంలో జాప్యంతో నిర్వాసితులకు నష్టం
ఆర్డీవో దగ్గరే మూలుగుతున్న రూ.90 కోట్ల పరిహారం సొమ్ము
ప్లాంటు నిర్మాణం పూర్తయ్యాక 584 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్న జెన్కో
నిర్మాణంలో ఉన్న యాదాద్రి విద్యుత్కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణంలో స్థలాలు, ఇళ్లు, పొలాలు సహా సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఆసరా కరవైంది. 2017లో ప్రారంభమైన ప్లాంటు నిర్మాణం 2021కల్లా పూర్తి కావాల్సి ఉంది. కానీ, నిర్మాణంలో తీవ్ర జాప్యం నిర్వాసితులకు శాపంగా మారింది. ఉద్యోగాలు కోరుకున్నవారికి అవి ఇంకా దక్కకపోగా.. పరిహారం కూడా అందరికీ అందలేదు. విద్యుత్కేంద్రం నిర్మాణానికి పర్యావరణ అనుమతి(ఈసీ) కోసం కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించిన నివేదికలో నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వివరాలను జెన్కో పేర్కొంది. దీని ప్రకారం.. పరిహారం పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నల్గొండ కలెక్టర్ కార్యాలయం పేరుతో జెన్కో రూ.288 కోట్లను 2016 జనవరి 4నే జమ చేసింది. పరిహారం పంపిణీ బాధ్యతను మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) కార్యాలయానికి కలెక్టర్ అప్పజెప్పారు. పరిహారం తీసుకోవడానికి కొందరు నిర్వాసితులు ముందుకురావడం లేదని, మరికొందరి చిరునామా తెలియడం లేదని అధికారులు అంటున్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన సొమ్ములో ఇంకా రూ.90 కోట్లు ఆర్డీవో కార్యాలయం అధీనంలోనే మూలుగుతున్నాయి.
ప్లాంటు నిర్మాణం నిమిత్తం నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలోని వీర్లపాలెం, కొత్తపల్లి, మోదుగుల తండా, కపూర్ తండాల్లో మొత్తం 4,569 ఎకరాలను జెన్కో సేకరించింది. ఇందులో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 1,012 ఎకరాలున్నాయి. రెండు తండాల్లోని 173 కుటుంబాలను పూర్తిగా ఖాళీ చేయించింది. మరోచోట ఇళ్లు కట్టించి ఇచ్చింది. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు(ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్-పీడీఎఫ్) నిబంధనల కింద బాధిత కుటుంబాలకు ఎకరానికి రూ.5 లక్షల పరిహారం లేదా ప్లాంటులో ఉద్యోగాలు ఇస్తామని జెన్కో తెలిపింది. తండాల్లోని 173 నిర్వాసిత కుటుంబాల్లో 133 మంది మాత్రమే ఉద్యోగాలివ్వాలని కోరారు. మిగిలిన 40 మందిలో 37 మంది పరిహారం తీసుకున్నారని, ముగ్గురి చిరునామా దొరకడం లేదని జెన్కో అధికారులు చెబుతున్నారు. ఇక వీర్లపాలెం, కొత్తపల్లిల్లో 487 మందికి చెందిన వ్యవసాయ భూములను సేకరించారు. వీరిలో 451 మంది ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్లాంటు కోసం 702 ఎకరాల అటవీ భూములను సేకరించారు. వాటిని సాగు చేసుకుంటున్న 563 మందికి పరిహారం ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించిన నివేదికలో జెన్కో పేర్కొంది. కాగా, వీరిలో కొందరికి రాజకీయ కారణాలతో పరిహారం అందించినట్లు ఆరోపణలున్నాయి.
భూవివాదాలతో జాప్యం జరుగుతోందంటున్న జెన్కో
నిర్వాసితులందరికీ పరిహారం అందని విషయమై జెన్కో అధికారులను ‘ఈనాడు’ వివరణ కోరగా.. పూర్తి పరిహారం సొమ్మును కలెక్టర్ కార్యాలయం పేరిట 2016లోనే జమ చేశామని, సొమ్ము అందని బాధితులు మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో సంప్రదిస్తే వెంటనే ఇస్తారని తెలిపారు. 36 మందికి సంబంధించిన భూములపై వివాదాలున్నాయని, వారికి ఇవ్వాల్సిన రూ.1.52 కోట్ల పరిహారం పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారణ జరుగుతోందని, అది పూర్తయ్యాక పరిహారం సొమ్ము పంపిణీ చేస్తామని తెలిపారు. వీరు కాకుండా అటవీ భూములకు సంబంధించి మరో 15 మందికి రూ.1.93 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇస్తామని వివరించారు. కొన్ని భూములపై ఇద్దరు లేదా ముగ్గురు తమకే హక్కులున్నాయని వాదిస్తుండటంతో పరిహారం పంపిణీ ఆగిపోయిందని చెప్పారు. వీటిపై రెవెన్యూశాఖ విచారణ జరిపి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. వచ్చే మార్చి నాటికి ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ భెల్ తాజాగా జెన్కోకు తెలిపింది. అప్పటికల్లా 584 మంది నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని జెన్కో యోచిస్తోంది. ప్రస్తుతం నిర్వాసితులు కూలి పనులు చేసుకుంటున్నారు.
ఆరోపణలపై విచారణ
ప్లాంటుకు సంబంధించిన భూసేకరణ, పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్ విచారణ చేయించింది. తాజాగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తోంది. ఆరోపణల నేపథ్యంలో ప్లాంటులో పరిహారం పంపిణీ విభాగంలో పనిచేస్తున్న సహాయ ఇంజినీరు(ఏఈ)ని హైదరాబాద్లోని జెన్కో ప్రధాన కార్యాలయానికి ఇటీవల బదిలీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే