Phone Tapping Case: కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం: తిరుపతన్న
ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పనిచేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు.
ఇందుకోసం ప్రత్యేక బృందాలు
వాంగ్మూలంలో తిరుపతన్న
ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పనిచేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇందుకోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాంగ్రెస్కు చెందిన డబ్బు పెద్దమొత్తంలో పట్టుకున్నామని, కామారెడ్డి నియోజకవర్గం కోసం మరో బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసుల విచారణలో తిరుపతన్న వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేను నల్గొండ జిల్లాలో ఎస్సైగా పనిచేసినప్పుడు ప్రభాకర్రావు అక్కడ ఓఎస్డీగా ఉండేవారు. అప్పటి నుంచే మా ఇద్దరికీ పరిచయం ఉంది. ఎస్ఐబీలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు అనుబంధ సంఘాల కదలికలు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చే విధులు నిర్వర్తించేవాడిని. ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్తో కలిసి మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేసేవాళ్లం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మావోయిస్టుల కదలికలు గమనించేందుకు పోలింగ్ రోజు అక్కడికి వెళ్లా. ఫోన్కాల్స్ను పర్యవేక్షించేందుకు ప్రణీత్రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్వోటీతో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రభాకర్రావుతో సమావేశం ఉండేది. ఇందులో నేను కూడా పాల్గొనేవాడిని. ఏ ఒక్కరోజు కూడా ప్రణీత్రావు వచ్చేవారు కాదు. ఆయనకు ఎలాంటి పనులు అప్పగించేవారో అప్పుడైతే నాకు తెలియదు. ఇటీవలి శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నగదు రవాణా సమాచారం విషయంలో ప్రణీత్రావుతో కలిసి పనిచేయాలని నన్ను ప్రభాకర్రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందంలో సీఐలు గట్టుమల్లు, చైతన్య, మల్లికార్జున్, ఆర్ఎస్ఐలు రాజవర్ధన్రెడ్డి, ఐదుగురు హెడ్కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు ఉండేవారు. మేమంతా వాట్సప్లోనే సంప్రదించుకునేవాళ్లం. 40 నుంచి 50 మందికి చెందిన ఫోన్లను ట్యాప్ చేసే బాధ్యత ఈ బృందానికి అప్పగించారు. సేకరించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు, టాస్క్ఫోర్స్, ఎస్వోటీకి చేరవేసి.. కాంగ్రెస్కు చెందిన డబ్బును విజయవంతంగా పట్టుకునేలా చూశాం.
శాసనసభ ఎన్నికల్లో లక్ష్యంగా చేసుకున్నవారిని గమనించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా బృందంలో ఉన్న వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోల్-2023 పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెద్దమొత్తంలో డబ్బు పట్టుకోగలిగాం. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సన్నిహితుడైన గాలి అనిల్కుమార్కు చెందిన రూ.90 లక్షలను కొల్లూరు వద్ద పట్టుకోగలిగారు. రేవంత్రెడ్డి మిత్రుడైన వినయ్రెడ్డి, మరో నలుగురి వద్ద రూ.1,99,85,000, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా డబ్బు రూ.7.5 కోట్లను షేక్ బిలాల్, రఘురామిరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్నాం. వీరి నుంచే మరోసారి రూ.3 కోట్లు, రాజగోపాల్రెడ్ది అనుచరుల నుంచి రూ.2.6 కోట్లు, విశాఖ ఇండస్ట్రీస్కు చెందిన కందుల రవికిశోర్ నుంచి రూ.50.45 లక్షలు, ఉత్తమ్కుమార్రెడ్డి సన్నిహితుడైన గిరిధర్రెడ్డి నుంచి రూ.35 లక్షలు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి చెందిన రూ.90 లక్షలు, మాదాపూర్ తీగల వంతెన వద్ద జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన రూ.20 లక్షలు, తారామతి బారాదారి వద్ద రూ.70 లక్షలు, ఖమ్మంలో పొంగులేటి అనుచరుడైన వ్యాపారి నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాతోపాటు బృందంలో పనిచేసిన ఇతర సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్థానిక పోలీసులు ఈ డబ్బు పట్టుకొని.. ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్కు చెందిన డబ్బు రవాణాను నియంత్రిస్తూ భారాసకు సజావుగా డబ్బు రవాణా అయ్యేలా చూశాం. ఇదంతా భారాసను మళ్లీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభాకర్రావు ఆధ్వర్యంలోనే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటపడకూడదని ప్రభాకర్రావు ఆదేశాలు, ప్రణీత్రావు సూచనల మేరకు 3 కంప్యూటర్ల హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాం. వాటి స్థానాల్లో కొత్తవి పెట్టాం. ఇతర కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులు, సర్వర్లను ధ్వంసం చేసి కొత్తవి పెట్టాం’’ అని తిరుపతన్న పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత