Telangana inter Board: దిద్దుకోలేని నిర్లక్ష్యం
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం
జవాబులు సవ్యంగా రాసినా మార్కులు రాక విద్యార్థుల ఆవేదన
పునఃపరిశీలనకు 48 వేల మంది దరఖాస్తు
మరో 2 వేల మంది రీకౌంటింగ్కు విజ్ఞప్తి
ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ
సంహితకు చెందిన ఓఎంఆర్ షీట్లో వేసిన మార్కుల్లో అనేకచోట్ల దిద్దుబాట్లు. మొత్తం మార్కుల వద్ద 97 వేసి 77గా మార్చిన వైనం..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబుపత్రాల పునఃపరిశీలన తర్వాత మార్కులను చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా?.. ఎంత నిర్లక్ష్యమా? అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 100కి 98, 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు
సెకండియర్లో వచ్చిన మార్కులను చూసి హతాశులవుతున్నారు. సరిగ్గా జవాబులను పరిశీలించకుండానే తమకు ఎంత తోస్తే అన్ని మార్కులు వేయడం.. మొత్తం మార్కుల కూడికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత సుమారు 48 వేల మంది పునఃపరిశీలనకు, మరో 2 వేల మంది పునఃలెక్కింపునకు దరఖాస్తు చేసుకున్నారు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తాము రాసిన జవాబుపత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంటర్బోర్డు తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఇంటర్లో అధిక మార్కులు పొందిన వారికి బీటెక్, ఇతర కోర్సుల్లో ఫీజు లేకుండా సీట్లు ఇస్తున్నారు. మరికొన్ని వర్సిటీలు కనీస మార్కుల నిబంధన విధిస్తున్నాయి. మూల్యాంకనంలో జరుగుతున్న దారుణాలతో వారు నష్టపోతున్నారు. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి జవాబుపత్రాలను నిపుణులకు చూపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇంటర్బోర్డు తప్పిదాలూ కారణమే
కొన్ని కార్పొరేట్, పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్ అధ్యాపకులను పంపుతున్నాయి. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంటర్బోర్డు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. 2019లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టడం లేదు. మార్కులు తేడా వస్తే జరిమానా వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కళాశాలల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని.. అసలు వారివద్ద పనిచేస్తున్న అధ్యాపకుల జాబితా తీసుకొని ఏటా అందులో కొంత శాతం మంది తప్పకుండా మూల్యాంకనానికి వచ్చేలా ఆదేశాలివ్వాలని పలువురు సూచిస్తున్నారు.
ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాషా సబ్టెక్టులో 21 మార్కులు వచ్చాయి. దీనిపై రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కాయి. ఆ జవాబుపత్రాన్ని పరిశీలించిన ఇంటర్బోర్డు అధికారులు.. మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకున్నారు.
హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంఈసీ విద్యార్థిని ఎస్.సంహితకు మొత్తం 926 మార్కులు వచ్చాయి. తొలి ఏడాది కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్లో 100కి 98 వచ్చాయి. కానీ సెకండియర్లో 77 మాత్రమే దక్కాయి. వాస్తవానికి ఆ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం కనీసం 95 మార్కులు రావాలి. ఈ విద్యార్థిని పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోగా.. మార్కుల్లో ఎటువంటి మార్పు లేదని ఇంటర్బోర్డు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబుపత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్థిని డౌన్లోడ్ చేసుకుంది. అధ్యాపకుడు తొలుత 97 మార్కులు వేసి.. తర్వాత దాన్ని 77గా మార్చినట్లు పేపర్లను చూస్తే స్పష్టమవుతోంది. పలు ప్రశ్నలకు మొదట ఇచ్చిన మార్కుల్ని కూడా దిద్దినట్లు ఓఎంఆర్ షీట్లో కనిపిస్తోంది. ఈ విద్యార్థిని మార్కుల విషయమై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
పలువురు విద్యార్థులు ప్రశ్నలకు సరైన జవాబులు రాసినా... సున్నా మార్కులు వేశారు. జనగామకు చెందిన స్వాతి అనే విద్యార్థిని 984 మార్కులు సాధించింది. సెకండియర్ రసాయనశాస్త్రంలో మొదట 57 మార్కులు వేశారు. పునఃపరిశీలనలో 59 దక్కాయి. రెండు మార్కుల ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. పరిశీలన అనంతరం దాన్ని సరిదిద్దారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇలాంటి బాధిత విద్యార్థులు వందల మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కని ప్రాజెక్టులు
రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి. -
వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సిట్ చేతికి సాంకేతిక ఆధారాలు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
కేసీఆర్కు న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుంది
‘‘విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జ్యుడిషియల్ విచారణకు రాబోమని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుంది. జస్టిస్ నరసింహారెడ్డి అనుభవం కలిగిన వారు. -
జులై ఆఖరులోగా తేల్చండి
విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్కేంద్రం కరెంటు కావాలా.. వద్దా.. అనేది జులై ఆఖరులోగా తేల్చిచెప్పాలని కేంద్ర విద్యుత్శాఖ కొత్త మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్ర విద్యుత్శాఖకు సూచించారు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష జరిగింది. -
సైబర్ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?
ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)