Southwest monsoon: ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రంలో అటు భద్రాచలం, ఇటు మెదక్ వరకు విస్తరించాయి. ఆ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
నేడు.. రేపు.. ఎల్లుండి ఓ మోస్తరు వానలు
10వ తేదీన భారీ వర్షసూచన
మహబూబ్నగర్, వరంగల్ పరిధిలోనూ వానలు
అలంపూర్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం
రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి
మెదక్ వరకూ నైరుతి విస్తరణ
నేడు.. రేపు.. ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీనగర్తండాలో ఈదురుగాలులకు ఎగిరిపోయి
చెట్టును ఆనుకుని నిలిచిన ఓ ఇంటి పైకప్పు రేకులు
ఈనాడు, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రంలో అటు భద్రాచలం, ఇటు మెదక్ వరకు విస్తరించాయి. ఆ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవగా, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల పరిధిలో అక్కడక్కడా జల్లులు కురిశాయి. పిడుగుపాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు, నాగర్కర్నూల్ జిల్లాలో ఒక్కరు మృత్యువాతపడ్డారు. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడటం, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో 8, దేవరకొండ 7, నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ కారణంగా రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తక్కువగా నమోదయ్యాయి.
కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని-సుశ్మీర్లో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు, నిలిచిన బస్సు
చెట్టుపై పిడుగుపడి..
- మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన రైతు శెట్టబోయిన సిద్ధయ్య(48) పశువుల కొట్టం నిర్మించే క్రమంలో తుంగ కోసం అదే గ్రామానికి చెందిన నందు(23)ను వెంటబెట్టుకుని గురువారం ఉదయం గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వర్షం రావడంతో ఇద్దరూ చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మరణించారు. పొలాల్లో పని చేస్తుండగా పిడుగు పడటంతో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన డలావత్ గెమ్యానాయక్ (55), కర్ణాటకకు చెందిన కూలీ బిల్లిపురం గోపాల్ (40) మరణించారు.
- ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగార్గాం గ్రామానికి చెందిన భార్యాభర్తలు అనక సంతోష్(26), అనక స్వప్న(23) గురువారం పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో తలదాచుకునేందుకు సమీపంలోని పాకలోకి వెళ్లారు. పాక పక్కనే ఉన్న టేకు చెట్టుపై పిడుగు పడటంతో ఆ ధాటికి భార్యాభర్తలు పాకలోనే ప్రాణాలొదిలారు.
- నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన యువ రైతు ముడారపు ప్రవీణ్(26) పొలం దున్నుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడ్డాడు. తానూరు మండలం ఎల్వత్కు చెందిన మాగీర్వాడ్ శ్రీ(13) గ్రామ శివారులో మేకలు మేపి ఇంటికి తిరిగి వస్తుండగా సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
- నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన జంగిలి ఈదమ్మ పొలంలో పత్తి విత్తనాలు వేసేందుకు కుమార్తె జంగమ్మ (40), అల్లుడు కృష్ణయ్యతో కలిసి వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోని ఓ చెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగుపడగా జంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణయ్య, ఈదమ్మ ఆపస్మారక స్థితికి చేరుకున్నారు.
మూడు రోజులపాటు..
రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 10న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్