Group-1 Prelims: తగ్గిన ప్రశ్నల కాఠిన్యం!
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది.
లాజికల్, అరిత్మెటిక్కు ఎక్కువ సమయం
కటాఫ్ మార్కులు 75 ఉండే అవకాశముందని నిపుణుల అంచనా
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్
74% హాజరైనట్లు కమిషన్ ప్రకటన
హనుమకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రంలోకి వస్తున్న అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా... 3.02 లక్షల మంది (దాదాపు 74%) హాజరయ్యారని టీజీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాల మదింపు తర్వాత హాజరు గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉంటాయంది. త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్సైట్లో ప్రాథమిక కీ పొందుపరుస్తామని, గ్రూప్-1 ప్రధాన పరీక్షలు అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయంది. ప్రిలిమ్స్ ప్రారంభానికి అర గంట ముందుగానే గేట్లు మూసివేస్తామని కమిషన్ స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఉదయం 9 నుంచే కేంద్రాల్లోకి వచ్చారు. ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం... గతంలో రద్దయిన రెండు ప్రశ్నపత్రాల కన్నా కొంత తేలికగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇందులో అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయన్నారు. ఓపెన్ కటాఫ్ మార్కులు 75 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ వర్తమాన వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్ పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసిన సంస్థ, కేంద్ర ప్రభుత్వ చట్టాలు, జీ-20, ఎన్నికల సంఘం కమిషనర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యంతర బడ్జెట్లపై ప్రశ్నలు అడిగారు.
పరీక్ష మధ్యలో బయోమెట్రిక్...
పరీక్ష మధ్యలో బయోమెట్రిక్ తీసుకోవడంతో అభ్యర్థులు కొంత ఇబ్బందికి గురయ్యారు. టీజీపీఎస్సీ జారీ చేసిన సూచనల ప్రకారం పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటామని, ఒకవేళ కుదరకుంటే చివర్లో తీసుకున్న తర్వాతే పరీక్ష కేంద్రం విడిచి వెళ్లాలంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే లోనికి అనుమతించినప్పటికీ, పరీక్ష ప్రారంభమయ్యే వరకు బయోమెట్రిక్ తీసుకోలేదు. పరీక్ష మధ్యలో తీసుకోవడం, రెండు చేతుల చూపుడు వేళ్ల బయోమెట్రిక్ నమోదులో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలతో సమయం కోల్పోయామని కొందరు అభ్యర్థులు తెలిపారు. సరిపడా సంఖ్యలో బయోమెట్రిక్ పరికరాలు లేకపోవడమే ఇందుకు కారణంగా ఆయా పరీక్షల కేంద్రాల సిబ్బంది తెలిపినట్లు వారు పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు.
అధికారులు, సిబ్బందికి అభినందనలు
జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తుశాఖల సిబ్బంది, టీజీఆర్టీసీ ఇతర విభాగాల సమన్వయంతో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమ్స్లో అభ్యర్థుల వ్యక్తిగత సమాచారంతో కూడిన ఓఎంఆర్ పత్రాలు ఇవ్వడంతోపాటు వారి బయోమెట్రిక్ను నమోదు చేశామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలను, స్ట్రాంగ్రూమ్లను సీసీ కెమెరాల ద్వారా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు.
50% మార్కులు దాటితే సేఫ్ జోన్
ప్రస్తుత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం... రద్దయిన గత రెండు పేపర్లతో పోల్చితే కొంత తేలికగా ఉంది. మొత్తం 150 ప్రశ్నల్లో... 25 ప్రశ్నలు అరిత్మెటిక్, లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్పై ఉన్నాయి. ఇవి ఎక్కువ సమయం తీసుకునేలా అడిగారు. మిగతా 125 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్కు సంబంధించినవి. మొత్తానికి నాణ్యమైన ప్రశ్నలు వచ్చాయి. పాలిటీలో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ, కొంత ఆలోచించేలా అడిగారు. అనాలసిస్ కన్నా ఫ్యాక్చువల్ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. పరీక్షలో ఓపెన్ కటాఫ్ 70-75 వరకు ఉండే అవకాశముంది. రిజర్వుడు వర్గాల వారీగా చూస్తే 65-75 మధ్య ఉంటుందని అంచనా. మొత్తం మీద 150 మార్కుల్లో కనీసం 50% దాటితే సురక్షిత జోన్లో ఉన్నట్లుగా భావించి అభ్యర్థులు గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు సన్నద్ధం కావచ్చు. శాస్త్ర, సాంకేతిక, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణం.. ఇలా అన్ని రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ట్రాన్స్జెండర్ వర్గాల చట్టాలు, సంక్షేమంపై పలు ప్రశ్నలున్నాయి.
బాల లత, డైరెక్టర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ
ప్రశ్నపత్రంలో సమతుల్యం
ప్రిలిమ్స్లో ప్రశ్నల ఎంపిక, కేటాయింపులో సమతుల్యం కనిపించింది. ప్రభుత్వ సర్వీసులకు వెళ్లే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. కొన్ని సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. వీటిని చదవడంతోపాటు జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రంతో పోల్చితే... టీజీపీఎస్సీ ప్రశ్నపత్రంలో తేలిక, మధ్యస్తం, కాఠిన్యం... ఇలా అన్ని ప్రశ్నలు ఉండేలా సమతుల్యం పాటించారు. కొన్ని ప్రశ్నలకు ఆలోచించి జవాబులు గుర్తించేలా ఉన్నాయి. ఓపెన్ క్యాటగిరీలో 78 మార్కులు కటాఫ్గా ఉండే అవకాశాలున్నాయి.
గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ట్రీ
తండ్రి పేరుకు బదులు భర్త పేరుందని పరీక్షకు నిరాకరణ
ఆదిలాబాద్ పాలనాప్రాంగణం, న్యూస్టుడే: ఓ అభ్యర్థిని ఆధార్కార్డులో తండ్రి పేరుకు బదులు భర్త పేరు ఉండటంతో... ఆమెను లోనికి అనుమతించని ఘటన ఆదిలాబాద్ పట్టణం చావర పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రంలో చోటుచేసుకుంది. పాత కార్డుంటే తెచ్చుకోవాలని సూచించినా... దాన్ని తెచ్చేందుకు రెండు నిమిషాలు ఆలస్యమైంది. పట్టణంలోని రాంనగర్కు చెందిన ఆమెకు దరఖాస్తు చేసుకున్నప్పుడు పెళ్లి కాకపోవడంతో తన తండ్రి పేరును ప్రస్తావించారు. ప్రస్తుతం పెళ్లయి ఆధార్లో మార్పులు చేసుకున్నారు. ఆమె ఇది వరకే జేఎల్కి ఎంపికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..