Telangana Formation Day: వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
2న గన్పార్కు వద్ద అమరవీరులకు సీఎం నివాళులు
పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం
సాయంత్రం ట్యాంక్బండ్పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు
ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్ శాంతికుమారి,
డీజీపీ రవిగుప్తా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దివ్య ఇతర ఉన్నతాధికారులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఆయా ఏర్పాట్లపై సోమవారం డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ... ‘‘ఉదయం సీఎం రేవంత్రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం సందేశం ఉంటుంది. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్యాంక్బండ్పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ ఉంటుంది. శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్తో పాల్గొంటారు. దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. నగరంలోని పేరొందిన హోటళ్లు ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఉంటాయి. ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి’’ అని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానకిశోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్రావు, అదనపు డీజీలు సంజయ్కుమార్ జైన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఎన్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, హెచ్ఎండీఏ అదనపు కమిషనర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2న గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని ప్రభుత్వ విభాగాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సీఎస్ ఎ.శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్పర్సన్లు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొనాలని కోరారు. ఎక్కడా ప్లాస్టిక్ జెండాలను వాడొద్దని స్పష్టంచేశారు.
పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్ల పరిశీలన
కంటోన్మెంట్, న్యూస్టుడే: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వేదిక, బారికేడింగ్, విద్యుత్తు, మంచినీటి సరఫరా, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితరాలపై ఆరా తీశారు. బందోబస్తు, ట్రాఫిక్, వీఐపీల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేపడుతున్న చర్యలు, వాహనాల పార్కింగ్ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్రావు, అదనపు డీజీ సంజయ్కుమార్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల