Telangana State Song: రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి.. 13.30 నిమిషాల నిడివితో మరోటి రెండు వర్షన్లుగా ఉంటుంది.
యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం
2న జాతికి అంకితం చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడి
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస నేతలతో భేటీ
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్ర గీతంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దీపా దాస్మున్షీ, గుత్తా సుఖేందర్రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు
ఉద్యమకాలంలో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించిన, తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా నిర్ణయించాం. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏళ్ల క్రితం రాసిన గీతాన్ని యథాతథంగా అమోదించాం.
-సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి.. 13.30 నిమిషాల నిడివితో మరోటి రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతం రూపొందించారు. రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మంత్రులు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస నేతలతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు ఎంపీలుగా ఉన్నవారు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి గురువారం సచివాలయంలో సమావేశమై.. రాష్ట్ర గీతంపై చర్చించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించింది. గీతం గురించి అందెశ్రీ వివరించారు.‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తవుతాయి. దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ వేడుకల సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని జాతికి అంకితం చేస్తాం’’ అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చినట్లు తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో పాటు ప్రభుత్వ సంస్థల పేర్లలో సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చామన్నారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించినట్లు స్పష్టం చేశారు.
సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, సీనియర్ నేత కె.జానారెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు పాల్గొన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ను ప్రభుత్వం రాష్ట్ర అధికార గీతంగా ఆమోదించడంపై కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం తెజస అధ్యక్షుడు కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ- తాము కోరుకున్న రాష్ట్ర గీతం, చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తోందని అన్నారు. ‘తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తొలిసారిగా భాగస్వామ్యం అవుతున్నాం. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఆహ్వానం అందలేదు. జయ జయహే తెలంగాణ కొత్తగా రాసిన పాట కాదు. రాసింది ఎవరనేదే ముఖ్యం.. పాడింది ఎవరన్నది కాదు. చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేది. దానిపై అభ్యంతరాలున్నా ఏమీ చేయలేని పరిస్థితులు అప్పుడున్నాయి. కొత్త లోగోలోనూ కట్టడాలు ఉంటాయని అనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
ఆవిర్భావ వేడుకలకు రండి
చుక్కా రామయ్యను ఆహ్వానించిన సీఎం రేవంత్రెడ్డి
చుక్కా రామయ్యను శాలువాతో సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో మహేశ్కుమార్గౌడ్, మోత రోహిత్
కాచిగూడ, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని విద్యావేత్త చుక్కా రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ విద్యానగర్ పరిధి విజ్ఞాన్పురి కాలనీలోని చుక్కా రామయ్య నివాసానికి సీఎం వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా హాజరు కావాలని కోరారు. అనంతరం రామయ్యను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మోత రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం