Urban Ponds: అర్బన్ చెరువులకు జల జీవం!
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. మురుగు, కాలుష్యం, ప్రమాదకర రసాయనాల కాసారాలుగా తయారయ్యాయి.
నీటిపారుదల, పురపాలక, రెవెన్యూ శాఖలతో కమిటీ
నెల రోజుల్లో సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్
కాలుష్య కాసారంగా మారిన హైదరాబాద్ మీర్పేటలోని చెరువు
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. మురుగు, కాలుష్యం, ప్రమాదకర రసాయనాల కాసారాలుగా తయారయ్యాయి. గతంలో నీటి వినియోగానికి ఉపయోగపడిన చెరువులు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలో భాగంగా మారాయి. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు పట్టణ చెరువుల(అర్బన్ లేక్స్) పునరుద్ధరణ బాధ్యతను పురపాలక శాఖకు అప్పగించింది. చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వివిధ రంగాల నిపుణులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ ఇటీవల కార్యశాల నిర్వహించింది. అందులో దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం నీటిపారుదల, పురపాలక, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన ఇంజినీర్లు, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసి, ముందుకెళ్లాలని నిర్ణయించారు.
ఏం చేయనున్నారంటే...
రాష్ట్రంలో 102 నగరాలు, పట్టణాల్లో వెయ్యికి పైగా నీటి వనరులు ఉన్నాయి. వాటిలో 442 చెరువులు. వీటికి పూర్వ కళ తీసుకొచ్చేందుకు ఐఐటీ, స్వచ్ఛంద సంస్థల నిపుణుల భాగస్వామ్యంతో సమగ్ర సర్వే చేయనున్నారు. నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాల్సిన ఈ బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. ప్రతి పురపాలక సంఘంలో ఎన్ని చెరువులున్నాయి? వాటి గరిష్ఠ సామర్థ్యం (ఫుల్ ట్యాంక్ లెవల్-ఎఫ్టీఎల్) ఎంత? ఆయా చెరువుల బఫర్ జోన్ ఎంత? ఆక్రమణలు ఉన్నాయా? ప్రస్తుత పరిస్థితి ఏమిటి? చెరువుల్లోకి వ్యర్థజలాలు, కాలుష్య కారకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటికి పూర్వపు శోభ తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన విధానం ఏమిటి? ఎంత వ్యయం అవుతుంది? ఎంతకాలం పడుతుంది? తదితర అంశాలపై సర్వే నిర్వహించాలని పురపాలక శాఖ డైరెక్టర్ డి.దివ్య మార్గదర్శకాలను జారీ చేశారు. జూన్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేసి ప్రతి చెరువు స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేస్తామని ఆమె ‘ఈనాడు’కు తెలిపారు. ఆ తర్వాత అమలు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
శుద్ధి చేశాకే నీటి మళ్లింపు
పట్టణాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, కాలుష్య జలాలను శుద్ధి చేసిన మీదటే చెరువుల్లోకి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం ద్వారా తటాకాలకు తిరిగి జీవం పోయాలనేది వారి ఆలోచన. చెరువులను శుద్ధమైన నీటితో నింపితే వివిధ రకాల పక్షులను ఆకర్షించవచ్చని, స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించవచ్చని అంటున్నారు. చెరువుల పరిరక్షణకు పట్టణాల్లో ఇప్పటికే ఉన్న లేక్ కమిటీలను మరింత చైతన్యం చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
మురుగు కమ్మేస్తోంది
రాష్ట్రంలో 64,055 జల వనరులు ఉన్నాయి. వాటిలో 12,323 చెరువులు, కుంటలు పూర్తిగా పనికిరానంతగా మారాయి. ఇవి మురుగునీటి నిల్వకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వీటిలో 17 జలాశయాలు, 2,135 చెరువులను కాలుష్య జలాలు పూర్తిగా కమ్మేశాయి. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది.
కబ్జాలతో కనుమరుగు
కేంద్ర జలశక్తి శాఖ గతేడాది నిర్వహించిన ఒక అధ్యయనం రాష్ట్రంలో 3,032 జలవనరులు ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. వాటిలో 50.8% కుంటలు, 49.2% చెరువులు ఉన్నాయంది. వీటిలో 10.4% వనరులు దాదాపు కనుమరుగు అయ్యేంతలా కబ్జాలకు గురైనట్లు గుర్తించింది. ఎక్కువ శాతం కబ్జాలున్న చెరువులు, కుంటలన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం