Telangana: నియమావళి ముగిసింది.. నియామకాలే తరువాయి..
వైద్య, ఆరోగ్యశాఖలో ఐదు వేలకు పైగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ప్రధానంగా వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్, ప్రజారోగ్యశాఖలో కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు.
వైద్య, ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
సమీక్షించిన మంత్రి, ఉన్నతాధికారులు
అత్యధికంగా వైద్యులు, స్టాఫ్నర్సుల పోస్టులు
ఈనాడు, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో ఐదు వేలకు పైగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ప్రధానంగా వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్, ప్రజారోగ్యశాఖలో కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండున్నర నెలల క్రితమే రాష్ట్ర ఆర్థికశాఖ ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు కోడ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రితో ఉన్నతాధికారులు చర్చించారు. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా పోస్టులు భర్తీ కానున్నాయి. ఉద్యోగాల భర్తీకి అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త వైద్యకళాశాలలు రావడంతో పాటు వైద్య, ఆరోగ్య సేవలు జాప్యం లేకుండా పూర్తిస్థాయిలో అందించాలని జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) నిబంధనలు కఠినతరం చేయడంతో ఎంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తయితే అంతమేర వెసులుబాటు వస్తుందని వైద్యవిద్య డైరెక్టరేట్ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థికశాఖ అనుమతించిన 5348 పోస్టులు.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్, వైద్య విధాన పరిషత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ), ఆయుష్తో పాటు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఉన్నాయి. ఒక్క వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలోనే మొత్తం 3235 పోస్టులున్నాయి.
భారీగా వైద్యుల పోస్టులు ఖాళీ
- ఇప్పటికే బోధనాసుపత్రులు, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. డాక్టర్ల నియామకం జరుగుతున్నా ఖాళీలు కూడా అదే సంఖ్యలో పెరుగుతున్నాయి. భర్తీకి అనుమతించిన వాటిలో 1610 వైద్యుల పోస్టులున్నాయి. నియామక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి వైద్యులను అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
- బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది సమస్య పరిష్కారానికి తాత్కాలికంగా నియామకాలను అనుమతించినా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని వైద్య, ఆరోగ్యశాఖ విభాగాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేసినా పోస్టులు మిగిలిపోయాయి. దీంతో ఈసారి విధించే నిబంధనలపై కూడా వైద్యవిద్య డైరెక్టరేట్ సమీక్షిస్తోంది. నియామక ప్రక్రియలో 596 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. వీటిలో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో కీలక విభాగాల్లో 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు.
- వైద్య విధానపరిషత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటమే కాకుండా కొత్త పోస్టుల అవసరం పెరిగింది. తాజాగా 1014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం చేపట్టనున్నారు.
- కొన్ని నెలల క్రితమే సుమారు ఏడువేల మందికి పైగా స్టాఫ్నర్సుల నియామక ప్రక్రియ పూర్తికాగా.. తాజాగా మరో 1988 మంది స్టాఫ్నర్సుల రిక్రూట్మెంట్ జరగనుంది. అనుమతించిన పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు 764 దాకా భర్తీ కానున్నాయి. ఫార్మసిస్టులు 191 మంది, ఏఎన్ఎంలు 85 మంది నియమితులు కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల