Land Rates: భూముల ధరలపై అధ్యయనం
వ్యవసాయ భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాబడులు పెంచుకునే క్రమంలో సర్కారు రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖపై దృష్టి సారించింది.
క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న రిజిస్ట్రేషన్లు - స్టాంపుల శాఖ
సాగు భూములు.. స్థలాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపునకు కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాబడులు పెంచుకునే క్రమంలో సర్కారు రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాకు కీలకమైన ఆదాయ వనరుల్లో ఒకటి భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే రాబడి. రాష్ట్రంలో 2021 జులై తరువాత ఛార్జీలను సవరించలేదు. 2022లో స్టాంపు డ్యూటీని మాత్రమే సవరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరల పెంపు, రాబడిపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రభుత్వం అంచనా వేస్తున్న రాబడిని శాఖ చేరుకోవడం లేదని, ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించేలా కృష్టి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మార్కెట్ పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు ఆ శాఖ సిద్ధమవుతోంది.
77 శాతమే రాబడి రావడంతో...
2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా ఖజానాకు రూ.18,500 కోట్ల రాబడి సాధించాలనేది లక్ష్యం. భూ లావాదేవీలతో రూ.14,295 కోట్లు మాత్రమే (77 శాతం) సమకూరాయి. దానిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మార్కెట్లో భూముల ధరలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ఫీజుల పెంపుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సాగు, సాగేతర భూములకు ప్రస్తుతం వాస్తవంగా ఉన్న విలువ, ఎంత మేరకు పెంచడానికి వీలున్నదనే విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. అపార్టుమెంట్లు, నివాస గృహాలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న ధరలు, మార్కెట్లో వాస్తవంగా ఉన్న విలువను కూడా పరిశీలించనున్నారు. వీటన్నింటిపై అధ్యయనం పూర్తి చేసిన తరువాత రిజిస్ట్రేషన్లు- స్టాంపుల శాఖ ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేయనుంది. స్టాంపు డ్యూటీ సవరణపైనా ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులు ఇలా
ఉమ్మడి ఏపీలో 2013లో చివరి సారి ఫీజుల పెంపు జరిగింది. దాని ప్రకారం మార్కెట్ విలువపై రిజిస్ట్రేషన్ ఫీజు 6 శాతంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఫీజులను 2021లో సవరించారు. స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్ఫర్ డ్యూటీ 0.5, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1.5 శాతం కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు మార్కెట్ విలువలో 7.5 శాతంగా ఉంది. వ్యవసాయ భూములకు ఎకరాకు కనీస ధర రూ.75 వేలు, ఖాళీ స్థలాలకు చ.గజం చొప్పున, నివాసాలకు చ.అడుగు చొప్పున కనీస ధర నిర్ణయించి మార్కెట్ విలువ పెంచారు.
రూ.5 వేల కోట్లకు పైగా.. రాబడి అంచనాలు!
2020-21లో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,260 కోట్ల రాబడి లభించింది. 2021 జులైలో మార్కెట్ ధరల సవరణతో 2021-22లో రూ.12,370 కోట్లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. ప్రభుత్వ మార్కెట్ ధర మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం రాబడి కోల్పోతున్నదన్న చర్చ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మార్కెట్ విలువ సవరించడం ద్వారా ఖజానాకు రూ.5 వేల కోట్లకు పైగా రాబడి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
రైతుల రుణమాఫీ.. రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలు..
నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్న క్యాబినెట్
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. చివరగా మార్చి 12న రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. శనివారం నాటి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కోడ్ అమల్లో ఉండడంతో మంత్రివర్గ భేటీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్కు లేఖ రాసింది. ఆయన దానిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర పునర్విభజన జరిగి వచ్చే జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తవుతుంది. పునర్విభజన చట్టానికి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించడంతో.. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చిస్తారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలు కూడా చర్చకు వస్తాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపైనా చర్చించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.