Telangana: 615 మందికో కానిస్టేబుల్!
తెలంగాణలో 615 మంది పౌరులకో పోలీస్ ఉన్నట్లు పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ(బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్-బీపీఆర్డీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి 442 మందికి ఒకరు.. అంటే లక్ష మంది పౌరులకు 226 మంది ఉండాలి.
తెలంగాణలో మొత్తం 24,247 ఖాళీలు
దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థలు ఇక్కడే
మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు
బీపీఆర్డీ తాజా నివేదికతో బహిర్గతం
ఈనాడు, హైదరాబాద్
తెలంగాణలో 615 మంది పౌరులకో పోలీస్ ఉన్నట్లు పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ(బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్-బీపీఆర్డీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి 442 మందికి ఒకరు.. అంటే లక్ష మంది పౌరులకు 226 మంది ఉండాలి. కానీ 163 మంది ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్శాఖ స్థితిగతులపై బీపీఆర్డీ తాజా నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 24,247 ఖాళీలున్నట్లు పేర్కొంది. తెలంగాణకు 139 ఐపీఎస్ పోస్టులు మంజూరు కాగా.. 122 మంది ఉన్నట్లు వెల్లడైంది.
రవాణా సదుపాయంలో ముందంజ
దేశవ్యాప్తంగా 77 పోలీస్ కమిషనరేట్లున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 12 ఉండగా.., తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు తొమ్మిదేసి కమిషనరేట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. 33 పోలీస్ శిక్షణ సంస్థలతో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. 1,12,122.4 చ.కి.మీ.లతో విస్తరించిన మనరాష్ట్రంలో ప్రతి 1.3 కి.మీ.ల పరిధికి ఒకరు అవసరం కాగా.. 1.81 కి.మీ.లకు ఒక పోలీస్ ఉన్నారు. ప్రస్తుతం ఠాణాల సంఖ్య 844. మొత్తం పోలీసు శాఖకు 19,982 వాహనాలు ఉండగా.. వీటిలో స్టేషన్లలో 5966 మాత్రమే ఉన్నాయి. ప్రతి 100 మంది పోలీసులకు రవాణా సదుపాయం కల్పిస్తున్న విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది.
ఉన్నత స్థాయిలో అదనం.. క్షేత్రస్థాయిలో అథమం
రాష్ట్రంలో డీజీపీ పోస్టులు రెండుకు గాను ఒకటి అదనంగా ఉండటం విశేషం. 6 అదనపు డీజీపీలకు 17 మంది ఉన్నారు. 16 ఐజీలకు 8 మంది.. 17 మంది డీఐజీలకు 12 మంది ఉన్నారు. 104 మంది ఏఐజీ/సీనియర్ ఎస్పీ/ఎస్పీ/కమాండెంట్ పోస్టులకు నలుగురు అదనంగా ఉన్నారు. 112 మంది అదనపు ఎస్పీ/డిప్యూటీ కమాండెంట్ పోస్టులకు 86 మంది.. 387 ఏఎస్పీలకు 352.. 1375 మంది ఇన్స్పెక్టర్లకు 1217 మంది.. 3832 మంది ఎస్సైలకు 2997 మంది.. 2654 మంది ఏఎస్సైలకు 2481 మంది.. 7616 హెడ్కానిస్టేబుళ్లకు 6199 మంది.. 32,747 మంది కానిస్టేబుళ్లకు 22161 మంది ఉన్నారు.
మహిళా పోలీసులు 5351 మంది
మహిళా పోలీస్ అధికారుల్లో సివిల్ విభాగంలో డీజీపీ స్థాయిలో ఒక్కరూ లేరు. ఆరుగురు అదనపు డీజీపీలు.. ఒక్కో ఐజీ, డీఐజీ.. 29 మంది ఎస్పీలు.. 13 మంది అదనపు ఎస్పీలు.. నలుగురు డీఎస్పీలు.. 27 మంది ఇన్స్పెక్టర్లు.. 372 మంది ఎస్సైలు.. 198 మంది ఏఎస్సైలు.. 320 మంది హెడ్కానిస్టేబుళ్లు.. 2907 మంది కానిస్టేబుళ్లున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61,811 మంది పోలీసులు ఉండగా.. అన్ని విభాగాల్లో కలిపి 5351 మంది మహిళా పోలీసులున్నారు. రాష్ట్రంలో ప్రతి 3530 మంది ఆడవారికి ఓ మహిళా పోలీస్ ఉన్నారు. 16 మహిళా ఠాణాలు ఉన్నాయి.
పోలీస్ శాఖ ఆధునికీకరణకు..
దేశవ్యాప్తంగా పోలీస్శాఖ ఆధునికీకరణకు రూ.2169.99 కోట్లను వివిధ రాష్ట్రాలు కేటాయించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇది సున్నా. రాష్ట్రప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్లో పోలీస్ బడ్జెట్ కింద రూ.7932.56 కోట్లు కేటాయించింది.
సీసీ కెమెరాలు 2.82 లక్షలు
- దేశవ్యాప్తంగా కమ్యూనిటీపరంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో సగానికి పైగా ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. మొత్తం 5,48,057 కెమెరాలకు రాష్ట్రంలో 2,82,558 ఉండటం విశేషం. రాష్ట్రంలో 844 స్టేషన్లకుగాను 750 ఠాణాల్లో సీసీ కెమెరాలున్నాయి.
- రాష్ట్రంలో డీఎస్పీ నుంచి ఆ పైస్థాయి అధికారుల వరకు మంజూరైన పోస్టులు 818 మందికి 767 మంది ఉన్నారు. ఏఎస్సై నుంచి ఇన్స్పెక్టర్ వరకు 11,027 మందికి 9,638 మంది, కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్తో పాటు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది 74,213 మందికి 51,406 మంది ఉన్నారు.
- తెలంగాణలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు 61,811 మంది ఉండగా.. వీరిలో 11,064 మంది ఎస్సీ అధికారులున్నారు. ఎస్సీలకు 15శాతం రిజర్వేషన్ ఉండగా.. ఇది 18 శాతంతో సమానం. ఎస్టీ అధికారులు 7199 మంది ఉన్నారు. వీరికి 10 శాతం రిజర్వేషన్ కేటాయించగా 11.7 శాతం మంది ఉన్నారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్కు.. 33,551 మందితో 54.5 శాతం మంది ఉన్నారు.
- తెలంగాణలో పోలీస్శాఖకు చెందిన ట్రాకర్ డాగ్స్ 125.. స్నిఫర్ డాగ్స్ 332 ఉన్నాయి. ఈ విషయంలో మనదే ప్రథమ స్థానం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం