Fiscal Deficit: ద్రవ్యలోటు రూ.49 వేల కోట్లు
రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో అది రూ.32,119 కోట్లు. తాజాగా 2023-24లో రూ.49,440.92 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో రూ.17,321.92 కోట్లు పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున అప్పటి ప్రభుత్వం నవంబరు నాటికే భారీగా అప్పులు సేకరించడంతో ద్రవ్యలోటు బాగా విస్తరించింది.
గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం రూ.2.59 లక్షల కోట్లు
వచ్చింది రూ.2.18 లక్షల కోట్లు - ఇందులో అప్పులు రూ.49 వేల కోట్లు
లక్ష్యం కంటే 29 శాతం అదనంగా రుణాల సేకరణ
వ్యయ లక్ష్యం రూ.2.49 లక్షల కోట్లు.. వెచ్చించింది రూ.2.11 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో అది రూ.32,119 కోట్లు. తాజాగా 2023-24లో రూ.49,440.92 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో రూ.17,321.92 కోట్లు పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున అప్పటి ప్రభుత్వం నవంబరు నాటికే భారీగా అప్పులు సేకరించడంతో ద్రవ్యలోటు బాగా విస్తరించింది. గతేడాది బడ్జెట్లో అప్పుల అంచనా రూ.38,234.94 కోట్లకు అదనంగా మరో రూ.11 వేల కోట్లను ప్రభుత్వం సేకరించింది. మొత్తం అప్పులు రూ.49 వేల కోట్లు దాటాయి. బడ్జెట్లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యంకన్నా 29 శాతం అదనంగా తీసుకోవడం గమనార్హం. అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం చూపడం ఆనవాయితీ. గతేడాది ఇలా మొత్తం రూ.2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకోగా చివరికి రూ.2.18 లక్షల కోట్లే వచ్చింది. వ్యయ లక్ష్యం రూ.2.49 లక్షల కోట్లు కాగా ఖర్చుపెట్టింది రూ.2.11 లక్షల కోట్లు. ఆదాయం అంచనాకన్నా రూ.41 వేల కోట్లు తగ్గగా.. వ్యయం రూ.38 వేల కోట్లు తగ్గింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2023-24)లో తెలంగాణ ఆదాయ, వ్యయాలు, సేకరించిన అప్పులు, జీతభత్యాలు, పింఛన్లు తదితర లెక్కలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది. ముఖ్యాంశాలు ఇవీ...
తగ్గిన జీఎస్టీ ఆదాయం
రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుంకం, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను(వ్యాట్) పద్దు కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద రూ.50,942.66 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.46,500.43 కోట్లు వచ్చాయి.
- గత నవంబరులో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం.. తదుపరి లోక్సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం 32 శాతానికి పైగా తగ్గింది. ఈ పద్దు కింద రూ.18,500 కోట్లు అంచనా వేస్తే రూ.14,295.56 కోట్లు(77.27 శాతం) వచ్చాయి. అంతకుముందు ఏడాది ఏకంగా 91 శాతం ఆదాయం లభించింది.
- పెట్రోలు, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను పద్దు కింద రూ.39,500 కోట్ల అంచనాకు గాను 24.08 శాతం తగ్గి రూ.29,989.55 కోట్లే వచ్చాయి.
- మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా వచ్చింది. రూ.19,884.90 కోట్లకు రూ.20,298.89 కోట్లు వసూలయ్యాయి.
- భూముల అమ్మకాలు, ఔటర్ రింగు రోడ్ టెండర్లు వంటివాటిపై భారీగా నిధులు సమకూరడంతో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.22,808 కోట్ల లక్ష్యానికి రూ.23,819.50 కోట్లు వచ్చాయి.
- కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.41,259.17 కోట్లకు గాను 76 శాతానికి పైగా తగ్గి రూ.9,729.91 కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో బడ్జెట్ ఆదాయ, వ్యయాల అంచనాలు పట్టాలు తప్పాయి. ద్రవ్యలోటు పెరిగి అంచనాకన్నా 29 శాతం అదనంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ఏడాది గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రూ.13,179 కోట్లు వచ్చాయి.
జీతభత్యాలు, పింఛన్లకు రూ.55 వేల కోట్లు...
- ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు వెచ్చించాల్సింది రూ.51,651 కోట్లు అనుకుంటే... ఆ మొత్తం రూ.55,752 కోట్లకు చేరింది. పింఛన్ల భారం లక్ష్యానికన్నా 29% అదనంగాపెరిగింది.
- సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం రూ.12,958.70 కోట్లు కాగా 27.38% తగ్గించి రూ.9,410.51 కోట్లే ఇచ్చారు.
- గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీల కింద రూ.22,407.67 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా రూ.23,337.40 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
- నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం... అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నవంబరులో రూ.9,701 కోట్లు రాగా.... కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రూ.13,703.92 కోట్లు వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో అదే అత్యధికం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్