5 ఏళ్ల లోపు బాలల్లో 27 శాతం మందికి పోషకాహార లోపం
ప్రపంచంలో అయిదేళ్లలోపు వయసు బాలల్లో 27 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారిలో అత్యధికులు ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యూనిసెఫ్ తెలిపింది.
20 ఆహార దారిద్య్ర దేశాల్లో 13 ఆఫ్రికాలోనే
యూనిసెఫ్ నివేదిక వెల్లడి
కాల్టుంగో (నైజీరియా): ప్రపంచంలో అయిదేళ్లలోపు వయసు బాలల్లో 27 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారిలో అత్యధికులు ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యూనిసెఫ్ తెలిపింది. 100 అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని బాలల స్థితిగతులను పరిశీలించి ఈ సంస్థ గురువారం నివేదిక విడుదల చేసింది. రోజులోనో, రెండు రోజుల్లోనో కనీసం ఒక్క పూట కూడా సరైన ఆహారానికి నోచుకోనివారెందరో ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఆహారపరమైన దారిద్య్రానికి లోనైన 20 దేశాల్లో 13 ఆఫ్రికాలోనే ఉన్నాయి. ప్రపంచంలో అయిదేళ్ల లోపు వయసువారిలో 27 శాతం మంది (18.1 కోట్ల మంది) ఆహార దారిద్య్రంతో బాధపడుతున్నారు. ఆఫ్రికాలో పలు దేశాల్లో సాయుధ సంఘర్షణల వల్ల పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులవుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గిపోయి పంటలు పండటం లేదు. ఫలితంగా ఆహార ధరలు పెరిగి, ఆఫ్రికాలో బాలబాలికలు ఆహార దారిద్య్రం బారిన పడుతున్నారు. తినడానికి తిండి లేక కృశించిపోతున్నారు. ఈ సమస్య తీవ్రమైతే బాలలు మరణించే ప్రమాదం 12 రెట్లు ఎక్కువ. ప్రోటీన్ లోపంతో వచ్చే క్వాషియోర్కర్ వ్యాధి చాలామందిని బలిగొంటోంది. పోషకాహార లోపం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచి పలు వ్యాధులకు లోనయ్యేట్లు చేస్తుంది. తీవ్ర ఆహార కొరతతో చాలామంది ఆఫ్రికా ప్రజలు ఆకులు, అలములను, మిడతలను తిని కడుపు నింపుకొంటున్నారు. నైజీరియా, సూడాన్లలో చాలామంది బాలలు ఆహారం లేక మరణిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన దక్షిణాఫ్రికా ప్రపంచంలో అత్యంత అసమానతలకు ఆలవాలం కూడా. ఇక్కడ ప్రతి నలుగురు బాలల్లో ఒకరు ఆహార దారిద్య్రానికి గురవుతున్నారు.
ఫలిస్తున్న యూనిసెఫ్ కృషి
ఈ దుర్భర పరిస్థితిని అధిగమించడానికి యూనిసెఫ్ కృషి మొదలుపెట్టింది. నైజీరియాలో సొంత పెరళ్లలోనే చిలగడ దుంప, కర్ర పెండలం, మొక్కజొన్న, చిరు ధాన్యాలు, కూరగాయల పెంపకంలో వేలాది మహిళలకు శిక్షణ ఇస్తోంది. వర్షాలు విఫలం కావడంతో ఇసుక సంచుల్లో ఈ మొక్కల పెంపకాన్ని నేర్పుతోంది. కోళ్లు, పశువుల పెంపకంలో మెళకువలనూ నేర్పుతోంది. పంటల వైవిధ్యీకరణ, ఆరోగ్య సేవకుల పనితీరుతో ప్రోత్సాహకాలను ముడిపెట్టడం వంటి విధానాల వల్ల పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలలో గడచిన పదేళ్లలో ఆహార దారిద్య్రంతో బాధపడుతున్న బాలల సంఖ్య 42 శాతం నుంచి 32 శాతానికి తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం