Russia- Ukraine War: 500 రోజులు.. 9 వేలకుపైగా పౌర మరణాలు.. 63 లక్షల మంది శరణార్థులు!
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి 500 రోజులు పూర్తయ్యింది. ఇప్పటివరకు తొమ్మిది వేల మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస తాజాగా అంచనా వేసింది.
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి 500 రోజులు పూర్తయ్యింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరిట మాస్కో దాడులు మొదలుపెట్టగా.. ఇప్పటికీ యుద్ధం (Russia- Ukraine war) ముగింపు దిశగా ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు.. రష్యా (Russia) సేనల భీకర దాడులతో ఉక్రెయిన్ (Ukraine)లో ఆస్తి, ప్రాణ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో మాస్కో దూకుడు కనబర్చినా.. ఆ తర్వాత కీవ్ సైతం పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ఎదురుదాడులకు దిగుతోంది.
ఈ క్రమంలోనే ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఇప్పటివరకు తొమ్మిది వేల మందికిపైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస (UN) తాజాగా వెల్లడించింది. మృతుల్లో 500 మంది చిన్నారులు ఉన్నట్లు ఉక్రెయిన్లో ఐరాస మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్ (HRMMU) తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని పేర్కొంది. యుద్ధంలో పౌర మరణాలను తీవ్రంగా ఖండించింది. 2022తో పోలిస్తే ఈ ఏడాది మృతుల సంఖ్య సగటు తక్కువగా ఉన్నప్పటికీ.. మే, జూన్లలో మళ్లీ పెరగడం ప్రారంభించిందని తెలిపింది.
ఈ యుద్ధంలో ఇరువైపులా వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యపై అటు రష్యాగానీ, ఇటు ఉక్రెయిన్గానీ ఇప్పటివరకు నిర్దిష్ట ప్రకటన చేయలేదు. అయితే, జులై 7 నాటికి 2.32 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు.. 63 లక్షల మంది ఉక్రెనియన్లు శరణార్థులుగా మారినట్లు ఐరాస అంచనా వేసింది. 60 లక్షల మంది నిరాశ్రయులయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 17 శాతం వరకు రష్యా ఆక్రమణలో ఉన్నట్లు అంచనా.
ఇదిలా ఉండగా.. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తూర్పు వైపుగా విస్తరణను వ్యతిరేకిస్తోన్న రష్యా అధినేత పుతిన్.. ఉక్రెయిన్ను అందులో చేర్చుకునే ప్రయత్నాన్ని నిలువరించే క్రమంలో ఆ దేశంపై సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. పేరుకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధమే అయినా.. ప్రస్తుతం నాటో- రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా తయారైంది. రష్యాపై ఎదురుదాడులకు వీలుగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు భారీఎత్తున ఆయుధ సాయం అందిస్తున్నాయి. తాజాగా అమెరికా ‘క్లస్టర్ బాంబు’లను అందజేస్తామని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే