Israel: ఇజ్రాయెల్కు 6,000 మంది భారత కార్మికులు!
Israel: యుద్ధంలో మునిగిన ఇజ్రాయెల్ను కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్, మేలో భారత్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు అక్కడికి చేరుకోనున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
జెరూసలెం: హమాస్తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ (Israel Hamas conflict) నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్ నుంచి 6000 మంది అక్కడికి చేరుకోనున్నారు. ఏప్రిల్, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
పాలస్తీనా కార్మికులు వెనక్కి వెళ్లటంతో..
స్థానికుల కొరత ఉన్నచోట ఇజ్రాయెల్ (Israel) నిర్మాణరంగం విదేశీ కార్మికులను నియమించుకుంటోంది. ఇప్పటి వరకు పాలస్తీనా అధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80,000, గాజాకు చెందిన 17,000 మంది అక్కడ పనిచేస్తుండేవారు. కానీ, తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది.
హమాస్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కార్మికుల కొరతే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ఉపాధిలేక జీవన వ్యయాలు పెరిగాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాతే కార్మికుల తరలింపు నిర్ణయం వెలువడింది. భారత్-ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడి కార్మికులను తీసుకెళ్లనున్నారు.
20,000 మందికి అనుమతి..
గతకొన్ని నెలల్లో దాదాపు 900 మంది కార్మికులు భారత్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం మరో 64 మంది అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయెలీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దాదాపు 20,000 మంది భారత, శ్రీలంక కార్మికులకు అనుమతులు ఇచ్చిందని అక్కడి నిర్మాణ రంగం తెలియజేసింది. వారిలో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించాయి. కానీ, వివిధ రకాల అనుమతులు, అధికారిక పత్రాల విషయంలో జాప్యం జరుగుతోందని పీటీఐతో చెప్పాయి. ఎంపికైన వారిలో చాలా మంది శ్రామికులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి వేచిచూస్తున్నారని తెలిపారు. డిసెంబర్లో భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో ఇజ్రాయెల్కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ఏడాదే చర్చలు..
భారత్, శ్రీలంకతో పాటు 7,000 మంది చైనా, 6,000 మంది తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇజ్రాయెల్కు చేరుకున్నారు. గత ఏడాది ఏప్రిల్లో ఆర్థిక మంత్రి నిర్బర్కత్ భారత్లో పర్యటించారు. నిర్మాణం సహా వివిధ రంగాల్లో అవసరమయ్యే సిబ్బందిని ఇక్కడి నుంచి నియమించుకోవడంపై చర్చించారు. దాదాపు 1,60,000 మంది అవసరం ఉన్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఇప్పటికీ ఇజ్రాయెల్లో 18,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కేర్గివర్గా ఉన్నారు. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. తమ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోవడం, ఆకర్షణీయమైన వేతనాల నేపథ్యంలో వారంతా అక్కడే కొనసాగుతున్నారు.
42,000 మంది కోసం మేలో ఒప్పందం..
మరోవైపు నిర్మాణ, నర్సింగ్ రంగంలో పనిచేసేందుకు 42,000 మంది భారతీయులను అనుమతిస్తూ గత మేలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 34,000 మంది నిర్మాణ, 8,000 మంది నర్సింగ్ రంగంలో పనిచేస్తారని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. గత ఆరు నెలల్లో 800 మంది ఆ దేశ వ్యవసాయ రంగంలోనూ చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ