Israel: ఇజ్రాయెల్కు 6,000 మంది భారత కార్మికులు!
Israel: యుద్ధంలో మునిగిన ఇజ్రాయెల్ను కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్, మేలో భారత్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు అక్కడికి చేరుకోనున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
జెరూసలెం: హమాస్తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ (Israel Hamas conflict) నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్ నుంచి 6000 మంది అక్కడికి చేరుకోనున్నారు. ఏప్రిల్, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
పాలస్తీనా కార్మికులు వెనక్కి వెళ్లటంతో..
స్థానికుల కొరత ఉన్నచోట ఇజ్రాయెల్ (Israel) నిర్మాణరంగం విదేశీ కార్మికులను నియమించుకుంటోంది. ఇప్పటి వరకు పాలస్తీనా అధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80,000, గాజాకు చెందిన 17,000 మంది అక్కడ పనిచేస్తుండేవారు. కానీ, తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది.
హమాస్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కార్మికుల కొరతే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ఉపాధిలేక జీవన వ్యయాలు పెరిగాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాతే కార్మికుల తరలింపు నిర్ణయం వెలువడింది. భారత్-ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడి కార్మికులను తీసుకెళ్లనున్నారు.
20,000 మందికి అనుమతి..
గతకొన్ని నెలల్లో దాదాపు 900 మంది కార్మికులు భారత్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం మరో 64 మంది అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయెలీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దాదాపు 20,000 మంది భారత, శ్రీలంక కార్మికులకు అనుమతులు ఇచ్చిందని అక్కడి నిర్మాణ రంగం తెలియజేసింది. వారిలో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించాయి. కానీ, వివిధ రకాల అనుమతులు, అధికారిక పత్రాల విషయంలో జాప్యం జరుగుతోందని పీటీఐతో చెప్పాయి. ఎంపికైన వారిలో చాలా మంది శ్రామికులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి వేచిచూస్తున్నారని తెలిపారు. డిసెంబర్లో భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో ఇజ్రాయెల్కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ఏడాదే చర్చలు..
భారత్, శ్రీలంకతో పాటు 7,000 మంది చైనా, 6,000 మంది తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇజ్రాయెల్కు చేరుకున్నారు. గత ఏడాది ఏప్రిల్లో ఆర్థిక మంత్రి నిర్బర్కత్ భారత్లో పర్యటించారు. నిర్మాణం సహా వివిధ రంగాల్లో అవసరమయ్యే సిబ్బందిని ఇక్కడి నుంచి నియమించుకోవడంపై చర్చించారు. దాదాపు 1,60,000 మంది అవసరం ఉన్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఇప్పటికీ ఇజ్రాయెల్లో 18,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కేర్గివర్గా ఉన్నారు. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. తమ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోవడం, ఆకర్షణీయమైన వేతనాల నేపథ్యంలో వారంతా అక్కడే కొనసాగుతున్నారు.
42,000 మంది కోసం మేలో ఒప్పందం..
మరోవైపు నిర్మాణ, నర్సింగ్ రంగంలో పనిచేసేందుకు 42,000 మంది భారతీయులను అనుమతిస్తూ గత మేలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 34,000 మంది నిర్మాణ, 8,000 మంది నర్సింగ్ రంగంలో పనిచేస్తారని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. గత ఆరు నెలల్లో 800 మంది ఆ దేశ వ్యవసాయ రంగంలోనూ చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట