UK flight delays: యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య.. వందల విమానాలు రద్దు..!
యూకేలోని నాట్స్ ఆధీనంలోని ఆటోమేటెడ్ ఫ్లైట్ ప్లానింగ్ సిస్టమ్ వ్యవస్థ మోరాయించింది. దీంతో వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
ఇంటర్నెట్డెస్క్: యూకే(UK)లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తాజాగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడమో.. ఆలస్యంగా (UK flight delays) నడవడమో చోటు చేసుకొంటున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు యూకే విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. అంతేకాదు.. యూకేకు రావాల్సిన విమానాల్లో కూడా జాప్యం చోటు చేసుకోవడంతో వేలాది మంది విదేశాల్లోనే చిక్కుకుపోయారు. ఈ సాంకేతిక సమస్యను కొన్ని గంటల వ్యవధిలోనే సరిచేశారు. కానీ, విమానయాన సర్వీసుల్లో, ఎయిర్ పోర్టుల్లో జాప్యం కొనసాగుతోంది. ఈ పరిస్థితి కొన్ని రోజులపాటు కొనసాగవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితిపై హీత్రూ విమానాశ్రయం సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘విమాన సర్వీసు షెడ్యూల్ అమల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం టికెట్లు బుక్ చేసుకొన్నవారు ఎయిర్ పోర్టుకు బయల్దేరే ముందు విమానయాన సంస్థను సంప్రదించండి’’ అని వెల్లడించింది.
ఇక గాట్విక్ ఎయిర్ పోర్టు మాత్రం మంగళవారం నుంచి సాధారణ షెడ్యూల్లో విమానాలను నడపాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ప్రయాణికులు విమానాల స్టేటస్ను ఎయిర్లైన్స్ వద్ద ధ్రువీకరించుకొని బయల్దేరాలని వెల్లడించింది. లూటన్ ఎయిర్ పోర్టులో షెడ్యూల్ జాప్యాలు నెలకొన్నాయి.
ట్రంప్ అభిమానం చూరగొన్న రామస్వామి..!
యూకేలోని నాట్స్ (నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసు) తొలుత ఆటోమేటెడ్ ఫ్లైట్ ప్లానింగ్ సిస్టమ్లో సమస్యను సోమవారం మధ్యాహ్నం గుర్తించింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇది మొరాయించినట్లు తెలుస్తోంది. దీంతో విమానాల షెడ్యూల్ ఆటోమెటిక్ వ్యవస్థలో సమస్యలు మొదలయ్యాయి. ఈ కారణంగా సిబ్బంది మాన్యువల్గా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జాప్యం మొదలైంది. ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే సరిచేసినట్లు నాట్స్ వెల్లడించింది. కాకపోతే విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటిష్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్, టీయూఐ తదితర సంస్థల విమాన ప్రయాణాల్లో జాప్యం నెలకొంది. దీనిపై నాట్స్ స్పందిస్తూ.. ‘‘మేము ఈ లోపం కారణంగా ప్రభావిత సర్వీసులను సాధారణ స్థితికి చేర్చేందుకు విమానయాన సంస్థలు, సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాం. మా ఇంజినీర్లు జాగ్రత్తగా ఫ్లైట్ ప్లానింగ్ సిస్టమ్ పనితీరును గమనిస్తున్నారు. మేము సాధారణ స్థితికి చేరతాం’’ అని వెల్లడించింది.
ప్రధాన విమానాశ్రయాల్లో అవస్థలు..
ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టులో సోమవారం ఒక్క రోజే 142 విమాన సర్వీసులు రద్దు కాగా.. 289 సర్వీసుల్లో జాప్యం నెలకొంది. ఇక గాట్విక్ ఎయిర్ పోర్టులో 111 విమానాలు రద్దు కాగా.. 253 సర్వీసుల్లో జాప్యం జరిగింది. మొత్తంగా యూకేకు రాకపోకలు జరిపే 1200 విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు మొత్తం మీద 2,00,000 మంది ప్రయాణికులు దీనికి ప్రభావితమై ఉంటారని అంచనా వేస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఎకానమీ ఎయిర్ లైన్స్ సంస్థ ఈజీజెట్ మంగళవారం 80 విమానాలను రద్దు చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్ 60 విమానాలు రద్దు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.