Electric War: అమెరికా, చైనా ఎలక్ట్రిక్ వార్!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో చైనా తిరుగులేని ఆధిపత్యం... ఈ సంఘర్షణకు కారణం! ఇప్పటికే చైనాను సుంకాలతో కట్టడి చేయాలని చూస్తున్న అమెరికా... ఇతర అగ్రదేశాలూ, ఐరోపానూ చైనాతో పోరులోకి దించుతోంది.
విద్యుత్ వాహనాల్లో చైనా ఆధిపత్యం
ఇది ప్రపంచ భద్రతకు ముప్పంటున్న అమెరికా
తాజా జీ-7 మంత్రుల సదస్సులో ఆందోళన
చైనాపై ఆర్థిక ఆంక్షలకు పిలుపు
ఈనాడు ప్రత్యేక విభాగం
యుద్ధాల కాలంలో...
మరో యుద్ధం ఊపందుకుంటోంది.
అదే అమెరికా సారథ్యంలోని పాశ్చాత్య దేశాలకు...
చైనాకు మధ్య ఎలక్ట్రిక్ యుద్ధం!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో చైనా తిరుగులేని ఆధిపత్యం... ఈ సంఘర్షణకు కారణం! ఇప్పటికే చైనాను సుంకాలతో కట్టడి చేయాలని చూస్తున్న అమెరికా... ఇతర అగ్రదేశాలూ, ఐరోపానూ చైనాతో పోరులోకి దించుతోంది. తాజాగా ఇటలీలో ముగిసిన జీ-7 దేశాల ఆర్థికమంత్రుల సమావేశంలో చైనా తీరుపై ఆందోళన వ్యక్తమైంది. తక్షణమే మేలుకోకుంటే... తమతమ అంతర్గత ఆర్థిక వ్యవస్థలు, ఉద్యోగాలకే కాకుండా.. ప్రపంచానికీ చైనా ‘అతి’ వల్ల అరిష్టం తప్పదని అమెరికా వాదించింది. చైనాను కట్టడి చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరింది. జీ-7లోని ఇతర పాశ్చాత్య దేశాలూ దీనికి అంగీకరించటం గమనార్హం!
2009 నాటికే...
చైనా మాల్... అంటే ప్రపంచవ్యాప్తంగా చవక వస్తువులనే పేరు! ఆటవస్తువుల్లోనే కాకుండా... కార్లలాంటి విలాసవస్తువుల్లోనూ అదే ‘చవక బ్రాండ్’ కొనసాగించటానికి నిర్ణయించుకున్న చైనా... ఇతర దేశాలకంటే ముందే కళ్లు తెరిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయంలో ముందుచూపుతో కదిలింది. వాటికి అవసరమైన ముడిపదార్థాలు కూడా ఆ దేశంలో పుష్కలంగా లభించటం... చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాలు చైనాకు కలసి వచ్చాయి. 2001లోనే విద్యుత్ వాహనాల పాలసీపై ఓ కచ్చితమైన ప్రణాళిక తయారు చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వం... 2009కల్లా బీవైడీ, ఎస్ఏఐసీ, ఎన్ఐఓలాంటి దేశీయ కంపెనీలకు ఆర్థిక సబ్సిడీలు ఇవ్వటం ఆరంభించి... టెస్లాలాంటి కంపెనీలనూ ఆకర్షించింది. 2023లో టెస్లా కంపెనీ తయారు చేసిన ఈవీల్లో సగానికిపైగా చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి వచ్చినవే.
- 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో 95% అమెరికా, ఐరోపా యూనియన్, చైనాల్లో జరగ్గా... వాటిలో ఒక్క చైనా వాటానే 60శాతం! ఐరోపాది 25%, అమెరికా 10%!
- 2023లో... చైనా కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యంలో 70శాతంకంటే తక్కువ పనిచేసినా... స్వదేశీ మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి చేశాయి. లాభాలను పెంచుకునేందుకు ఇప్పుడు విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తాజాగా... అమెరికా పక్కనే మెక్సికోలో ఉత్పత్తి ఆరంభించాలని చైనా కంపెనీ బీవైడీ యోచిస్తోంది. అదే అమెరికా, ఐరోపాలను భయపెడుతోంది. తక్కువ ధరకు లభించే చైనా ఈవీ ఉత్పత్తులు వచ్చిపడితే... అంతర్గతంగా తమ దేశాల్లోని పరిశ్రమలు దెబ్బతింటాయని... తద్వారా ప్రజల ఉపాధి దెబ్బతింటుందనే ఆందోళన మొదలైంది. అందుకే చైనా ఈవీ ఉత్పత్తులపై ఇంతకుముందున్న 25శాతం దిగుమతి సుంకాన్ని 100శాతానికి పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. అంతేగాకుండా... ఇలా అవసరానికి మించి చైనా చేస్తున్న అతి ఉత్పత్తి కారణంగా ప్రపంచ భద్రతకూ ముప్పువాటిల్లుతుందని అమెరికా ఆర్థిక మంత్రి ఎలెన్ ఆందోళన వ్యక్తంచేయటం విశేషం.
ఐరోపాలో ఆందోళన ఉన్నా...
ఐరోపా యూనియన్ కూడా చైనా ఈవీ విధానంపై అధ్యయనం చేస్తోంది. తమకు కలిగే ముప్పుగురించి భయపడుతున్నా... ఐరోపాలోని అన్ని దేశాలూ... చైనాతో సంఘర్షణకు సిద్ధంగా లేవు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఐరోపా దేశాలతో చైనా కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. తాయిలాలు వేస్తూ వారిని ఊరిస్తోంది. తాజాగా... జర్మనీలో చైనా కంపెనీ ఒకటి బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో భారీగా పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఐరోపాలోనే ఇది అత్యంత పెద్దదని చెబుతున్నారు. అడుగుపెట్టడానికి చోటిస్తే... చైనా మొత్తానికే మింగేస్తుందనే భయం యూరోపియన్ యూనియన్లో లేకపోలేదు. గతంలో వోల్వోను చైనా కంపెనీ అలాగే తినేసిందని గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో... అమెరికాలా తక్షణం... చైనాతో ఘర్షణకు దిగలేని అశక్తత ఈయూ దేశాలది. మొత్తానికి... అటు అమెరికా, ఇటు చైనా ఎలక్ట్రిక్ వార్లో ఎవరికి వారే పైచేయి సాధించటానికి ఎత్తులు వేస్తున్నారు.
- సోలార్ పీవీలు, పవన విద్యుత్, బ్యాటరీల్లాంటి కార్బన్ సాంకేతిక ఉత్పత్తుల్లో 60శాతం; ఎలక్ట్రోలైసర్ తయారీ (హైడ్రోజన్ ఉత్పత్తి)లో 40%; ప్రపంచ పునరుత్పాదక ఇంధన వాడకంలో 30-35శాతం చైనాదే!
- ప్రపంచ వ్యాప్తంగా ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో 83% చైనా చేతుల్లో ఉంది.
- ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీలో అత్యంత విలువైన ఖనిజసంపదపై చైనా ఆధిపత్యం అగ్రరాజ్యాలను ఆందోళనలో పడేస్తోంది. 65% లిథియం, 35% నికెల్, 75%పైగా కోబాల్ట్, 90%పైగా శుద్ధ మాంగనీస్, 95%పైగా గ్రాఫైట్ చైనా చేతుల్లో ఉంది. 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా అవసరమైన బ్యాటరీ ఉత్పత్తిలో 70శాతం చైనాలోనే తయారవుతోంది.
- విద్యుత్ వాహన వ్యవస్థలోని సప్లయ్ చెయిన్ చైనా చేతుల్లోనే ఉంది. ఫలితంగా బ్యాటరీ సెల్ తయారీకయ్యే ఖర్చు అమెరికాలో కంటే చైనాలో 20% చవక!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం