Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వీళ్లకు బాగా కలిసొచ్చింది!
రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) ప్రభావం వల్ల చమురు (oil), సహజవాయు ధరల్లో పెరుగుదల కొన్ని సంస్థల సీఈవోలకు బాగా కలిసొచ్చింది. అధికమొత్తంలో లాభాలు రావడంతో యాజమాన్యాలు వాళ్ల జీతాలను భారీగా పెంచేశాయి.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. యుద్ధ ప్రారంభమైన తర్వాత ముడి చమురు (oil), సహజవాయువు (Natural Gas) ధరలు అమాంతం పెరిగిపోయాయి. చమురు సంస్థలు (Oil Companies) భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో యాజమాన్యాలు సంస్థ సీఈవోల జీతాలను గతంలో ఎన్నడూ లేనంతగా పెంచాయి. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ చమురు సంస్థ తన సీఈవో జీతాన్ని ఒక్కసారిగా 52 శాతం మేర పెంచినట్లు ది గార్డియన్ పత్రిక తెలిపింది. గతేడాది ఎక్సోమొబిల్ సంస్థ గంటకు దాదాపు 6.3 మిలియన్ డాలర్ల లాభాలను గడించించినట్లు పేర్కొంది. అయితే, అన్ని చమురు సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను ఇంత మొత్తంలో పెంచలేదు. నిజానికి చమురు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల వార్షిక వేతనాలు గతేడాదితో పోల్చితే తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సాన్ మొబిల్ సంస్థలో సగటు ఉద్యోగి వార్షిక వేతనం 9శాతం మేర పడిపోగా.. చెవ్రాన్ సంస్థ ఉద్యోగుల వార్షిక వేతనాలు 12శాతం మేర తగ్గాయి.
ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ చమురు సంస్థలు 2022లో రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి. ఆయిల్, సహజవాయువు ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగుల సంఖ్యను కూడా పరిమితం చేయడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. అమెరికాలోని చమురు సంస్థల సీఈవోలలో ఎక్సాన్ సీఈవో జీతంలోనే పెరుగుదలే అధికం. ఆ తర్వాత స్థానంలో చెవ్రాన్ సంస్థ సీఈవో మిచెల్ విర్త్ 4 శాతం అధిక వేతనం పొందారు. ఆకీడెంటల్ పెట్రోలియం సీఈవో విక్కీ హొల్యూబ్స్ 35శాతం పెరుగుదల సాధించినప్పటికీ.. చెవ్రాన్ సీఈవో జీతంతో పోల్చుకుంటే తక్కువ. మరోవైపు గత ఏడాది కంటే కోనొకో ఫిలిప్స్ సీఈవో రెయాన్ లాన్సే వార్షిక వేతనంలో 16శాతం కోతపడింది.ఆయా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆకీడెంటల్ ఉద్యోగుల వార్షిక వేతనం 19శాతం పెరగ్గా.. కోనొకో ఉద్యోగుల వేతనం 1 శాతం మేర తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?