Ukraine: నా పెంపుడు పులులను రక్షించండి.. ఓ ఆంధ్రా వైద్యుడి విన్నపం
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ను వీడిన ఓ ఆంధ్రా డాక్టర్.. తన పెంపుడు పులులను (Jaguar, Panther) రక్షించాలని భారత్తో పాటు వివిధ దేశాలను వేడుకుంటున్నారు.
లండన్: ఉక్రెయిన్పై (Ukraine Crisis) రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా లక్షల మంది పౌరులు యుద్ధ క్షేత్రాన్ని వీడిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్ సేనల భీకర దాడులతో వణికిపోయిన ఉక్రెయిన్ ప్రజలు.. ఇళ్లు, పెంపుడు జంతువులను వదిలి కట్టుబట్టలతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలా యుద్ధం కారణంగా అక్కడ నుంచి పొరుగు దేశానికి వెళ్లిపోయిన ఓ ఆంధ్రా డాక్టర్.. తన పెంపుడు పులులను (Jaguar, Panther) రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ (Jaguar Kumar).. ఉక్రెయిన్లోని సెవెరోదొనెట్స్క్లో ఉన్న ఓ ఆస్పత్రిలో పనిచేసేవారు. ఉక్రెయిన్లో స్థిరపడ్డ ఆయనకు పెంపుడు జంతువులంటే ఇష్టం. దీంతో కీవ్లోని జంతు ప్రదర్శనశాల నుంచి రెండు అరుదైన చిరుతలను సంపాదించారు. ‘యశా’ అనే జాగ్వర్ (హైబ్రిడ్ చిరుతపులి)తో పాటు ‘సబ్రినా’ అనే ఫాంథర్ (నల్లటి చిరుత)లను గత రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. అంతరించిపోతున్న పులులు జాతులను కాపాడే ప్రయత్నమని చెప్పే ఆ వైద్యుడిని జాగ్వర్ కుమార్గా పిలిచేవారు.
అయితే, రష్యా దాడుల్లో పాటిల్ పనిచేస్తున్న ఆస్పత్రి నాశనం కావడంతోపాటు.. ఆ ప్రాంతాన్ని పుతిన్ సేనలు ఆక్రమించుకున్నాయి. పాటిల్కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. పెంపుడు పులుల (Pet Jaguar) పోషణ కష్టతరమైంది. దీంతో వాటిని లుహాన్స్క్లోని స్థానిక రైతు వద్ద వదిలిపెట్టి పోలాండ్కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలాండ్ రాజధాని వార్సాలో ఆశ్రయం పొందుతున్న ఆయన.. ఆ రైతుకు ఫోన్ చేస్తూ నిత్యం వాటి బాగోగులను తెలుసుకునే వాడు. ఇటీవల అక్కడ ఇంటర్నెట్ సేవలు మూతపడడంతో వాటిని చూసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన.. తన పులులను ఎలాగైనా రక్షించుకోవాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పీటీఐ వార్తా సంస్థ వద్ద పాటిల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
‘పెంపుడు పులులకు దూరంగా ఉండడం నన్ను ఎంతగానో వేధిస్తోంది. ఆ మధురమైన జ్ఞాపకాలు ఓవైపు, వాటి మంచి చెడుల గురించిన భయాలు నన్ను వెంటాడుతున్నాయి. దీంతో ఒక్కోసారి కుంగుబాటుకు గురవుతున్నా’ అని పాటిల్ వాపోయాడు. అయితే, వాటిని తరలించడానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తనకు స్పష్టంగా తెలియదని.. అయినప్పటికీ తన పెంపుడు జంతువుల భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ పొరుగు దేశాలు, యూరప్ లేదా భారత్ వంటి దేశాలు వాటిని రక్షించేందుకు ముందుకు వస్తే పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వీటిని రక్షించేందుకు కీవ్లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని కోరినప్పటికీ వారి నుంచి ఎటువంటి సహాయమూ అందలేదని.. దీంతో భారత ప్రభుత్వం తన రెండు చిరుత పులులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. భారత్తోపాటు వివిధ దేశాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.