Missile strike: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతంపై క్షిపణి దాడి.. 27 మంది మృతి

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో జరిగిన క్షిపణి దాడిలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 22 Jan 2024 01:57 IST

కీవ్‌: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో క్షిపణి దాడి స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం ఉదయం డొనెట్స్క్‌లోని టెక్ట్స్‌ల్షిక్‌ మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో కనీసం 27 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలు కాగా.. వీరిని ఆస్పత్రికి తరలించినట్లు ఆ ప్రాంతంలోని రష్యా అధికారి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఉక్రెయిన్‌ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు సదరు అధికారి చెప్పారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు కీవ్‌ స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు