Elon Musk: ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చర్చి బిషప్పై జరిగిన కత్తిదాడికి సంబంధించిన పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ను (Social Media X) అక్కడి ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ (Anthony Albanese), ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
దాడికి సంబంధించిన పోస్టులపై నిషేధం విధించేందుకు అనుమతించాలంటూ ఆస్ట్రేలియా సైబర్ నియంత్రణా సంస్థ ‘ఈ-సేఫ్టీ’ కమిషనర్ చేసుకున్న విజ్ఞప్తిని సోమవారం ఫెడరల్ కోర్టు అంగీకరించింది. రెండురోజుల పాటు ఆ సంఘటనకు సంబంధించిన కంటెంట్ను నిలువరించాలని ‘ఎక్స్’ను (Social Media X) ఆదేశించింది. సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉండడం, వాటిపై వివిధ వర్గాల నుంచి కామెంట్లు రావటంతో వాటిని బుధవారం మధ్యాహ్నం వరకు కనిపించకుండా చేయాలని తెలిపింది.
దీనికి స్పందించిన సోషల్ మీడియా సంస్థ.. ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే కంటెంట్ను ఆపేసింది. ఆ దేశం వెలుపల ఉండే యూజర్లకు మాత్రం అవి ఇంకా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ను నియంత్రించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.
‘ఎక్స్’ తీరుపై ఆల్బనీస్ (Anthony Albanese) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఎలాన్ మస్క్ (Elon Musk) తన ప్లాట్ఫామ్పై హింసాత్మక కంటెంట్ను ఉంచేందుకు పోరాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ క్రమంలో మస్క్ను ఆయన ‘పొగరుబోతు బిలియనీర్’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనకు తాను చట్టానికి అతీతుడిగా మస్క్ భావిస్తున్నారని ఆరోపించారు. ఆస్ట్రేలియా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే కంటెంట్ను తొలగించాలని ఆదేశించామని గుర్తుచేశారు.
ఆల్బనీస్ (Anthony Albanese) స్పందించడం కంటే ముందే కోర్టు ఆదేశాలపై మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్ను ఆ దేశ సెన్సార్షిప్ కమిషనర్ అంటూ ఎద్దేవా చేశారు. హింసాత్మక కంటెంట్ను తొలగించకపోవడం సమంజసం కాదంటూ ఆల్బనీస్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ‘ఎక్స్’ను నిజమైన వాక్ స్వాతంత్ర్యానికి వేదికగా ప్రధాని పరోక్షంగా అంగీకరించారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!