రియల్ ఎస్టేట్ ఏజెంట్ తప్పిదం.. రూ.24 కోట్ల ఇల్లు బుగ్గిపాలు
ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసిన ఓ తప్పిదం వల్ల రూ.24 కోట్ల విలువైన ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది.
సిడ్నీ: కొన్నిసార్లు నిర్లక్ష్యం వల్ల జరిగే తప్పులు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. అందుకు ఉదాహరణే ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney)లో చోటుచేసుకున్న ఘటన. ఇంటి స్టోర్ రూమ్లో లైట్ వేసి ఉంచడంతో అగ్నిప్రమాదం జరిగి మూడు మిలియన్ డాలర్ల (సుమారు రూ.24 కోట్లు) విలువైన ఇల్లు బూడిదగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
జూలీ బండోక్ అనే మహిళ సిడ్నీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న అవలోన్ బీచ్ సమీపంలో ఖాళీగా ఉన్న ఇంట్లో ఓ వాటాను పరిశీలించేందుకు మంగళవారం వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు బాల్కనీలో పరుపు కనిపించింది. అంతకుముందు ఆ వాటాలో అద్దెకున్నవాళ్లు దాన్ని మర్చిపోయి ఉంటారని భావించి బెడ్ రూమ్ కింద ఉన్న స్టోర్ రూమ్లో దాన్ని దాచింది. తర్వాత అందులో ఉన్న లైట్ ఆన్ చేసి పైకి వచ్చేసింది. 20 నిమిషాల తర్వాత ఇల్లంతా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనపై యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో స్టోర్ రూమ్ నుంచి మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. చాలాసేపు లైటు వేసి ఉంచడంతో వేడెక్కి పరుపు కాలిపోయి ఇల్లంతా మంటలు వ్యాపించాయని తెలిపారు. దాన్ని తానే స్టోర్ రూమ్లో ఉంచినట్లు జూలీ అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ప్రమాదానికి జూలీ బాధ్యురాలని, బాధితులకు ఆమె నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.