Whooping cough: ఆ దేశాల్లో ‘కోరింత దగ్గు’ కలవరం.. ఫిలిప్పీన్స్లో 54 మరణాలు
చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్తోపాటు నెదర్లాండ్ దేశాలను కోరింత దగ్గు (Whooping Cough) కలవరపెడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోరింత దగ్గు (Whooping Cough) కలవరపెడుతోంది. చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్తోపాటు నెదర్లాండ్స్లో అనేక మరణాలు నమోదవుతున్నాయి. కేవలం ఫిలిప్పీన్స్లోనే మూడు నెలల్లో 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఫిలిప్పీన్స్ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మూడు నెలల్లోనే సుమారు వెయ్యి కోరింత దగ్గు కేసులు నమోదయ్యాయి. 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్రితం ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య 34 రెట్లు పెరిగింది. చైనాలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 32వేల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20 రెట్లు అధికం. బ్రిటన్లోనూ ఇటీవల ఈ కేసులు పెరిగినట్లు అక్కడి వైద్యాధికారులు పేర్కొన్నారు. కేవలం జనవరిలోనే 553 కేసులు నమోదయ్యాయి. దాంతో వ్యాక్సిన్ తీసుకోవడంలో చిన్నారులు, గర్భిణులు నిర్లక్ష్యం వహిస్తుండటంపై స్థానిక ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. ఆస్ట్రేలియాలోనూ గత మూడు నెలల్లో 2,799 వూపింగ్ కాఫ్ కేసులు రికార్డయ్యాయి.
లక్షణాలేంటీ..?
కోరింత దగ్గు.. శాస్త్రీయనామం పెర్టుసిస్ (Pertussis). బోర్డిటెల్లా పెర్టుసిస్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. గాలి ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. తొలుత జలుబు లక్షణాలతో మొదలై జ్వరం, వదలని దగ్గు వంటివి తీవ్రంగా ఉంటాయి. సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుంది. కొందరిలో 12 వారాల వరకు దీని ప్రభావం ఉంటుంది. అందుకే దీన్ని వంద రోజుల దగ్గు (100-day Cough) అని కూడా పిలుస్తారు.
వారికి ప్రాణాంతకం..
ఈ ఇన్ఫెక్షన్ అన్ని వయసులవారికి సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ చిన్న పిల్లల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోని నవజాత శిశువులకు ప్రాణాంతకంగా మారుతుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మాత్రం ప్రభావం తక్కువే. వ్యాధి నిర్ధరణ తర్వాత యాంటీబాడీల వృద్ధి కోసం చికిత్స ఇస్తారు. ప్రతీ మూడు, నాలుగేళ్లకు ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి