Banana Artwork: ఆకలేసిందని ఆర్ట్ వర్క్నే తినేశాడు..!
ఉదయం అల్పాహారం తినని ఓ కుర్రాడు ఆర్ట్ మ్యూజియంకు వెళ్లాడు. అక్కడ కనిపించిన అరటిపండును ఏమాత్రం ఆలోచించకుండా తినేశాడు. దాని ఖరీదు 1,20,000 డాలర్లు.
ఇంటర్నెట్డెస్క్: ఆర్ట్వర్క్ మ్యూజియంలో కొన్ని వస్తువులు చూడటానికి సాధారణంగా ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని నెలల క్రితం అమెరికా(USA)లోని ఓ మ్యూజియంలో గాజుకుక్క బొమ్మను ఓ అవ్వ తాకి చూడబోయింది. పొరబాటున అది కిందపడి రూ.34 లక్షల నష్టం వాటిల్లింది. తాజాగా అటువంటి ఘటనే దక్షిణ కొరియా(South Korea)లో చోటు చేసుకొంది. కానీ, ఇక్కడ సదరు మహాశయుడు కావాలనే ఆర్ట్ మ్యూజియంలో ఉన్న దానిని ఆరగించాడు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో లియూమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో మౌరిజియో కాటెలాన్ అనే ఇటలీ కళాకారుడి ఆర్ట్వర్క్ను ప్రదర్శించారు. దీనిలో అరటిపండుతో చేసిన ‘కమెడియన్’ అనే దానిని ప్రదర్శించారు. గోడకు టేపుతో అతికించారు. ఈ ప్రదర్శన చూడటానికి నోహ్ హుయున్ సూ అనే విద్యార్థి వచ్చాడు. ప్రదర్శనలో గోడకు అతికించిన అరటి పండును చూడగానే మరో అలోచన లేకుండా దానిని తీసుకొని.. తాపీగా తొక్క ఒలుచుకొని తిన్నాడు. అనంతరం ఆ తొక్కను టేపుతో గోడకు అంటించాడు. విషయం తెలుసుకొన్న మ్యూజియం నిర్వాహకులు అక్కడకు వచ్చి అరటిపండు ఎందుకు తిన్నావని ప్రశ్నించారు. ‘‘ఉదయం అల్పాహారం తినలేదు’’ అని హుయున్ సూ వారికి తాపీగా సమాధానం చెప్పాడు. దీంతో చేసేది లేక మ్యూజియం నిర్వాహకులు అతడికి ఎటువంటి జరిమానా విధించకుండా విడిచిపెట్టారు. ఆ ప్రదేశంలో మరో అరటిపండును తీసుకొచ్చి అతికించారు. ఈ ఆర్ట్వర్క్లో ప్రతి మూడు రోజులకోసారి అరటిపండును మారుస్తుంటారు. వాస్తవానికి నోహ్ హుయున్ సూ కూడా సియోల్ యూనివర్శిటీలో ఆర్ట్ మేజర్ విద్యార్థి కావడం గమనార్హం. అతడు ఓ బ్రాడ్కాస్టింగ్ సంస్థతో మాట్లాడుతూ తన చర్యలను కూడా ఓ కళగా అర్థం చేసుకోవచ్చని సమర్థించుకొన్నాడు.
‘కమెడియన్’ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్వర్క్ పెద్దగా ఖరీదు ఉండదని మనం అనుకొంటాము. కానీ, 2019లో దీనిని తొలిసారి మియామి బీచ్ ఆర్ట్ బాసెల్లో ప్రదర్శించారు. 1,20,000 డాలర్లు (రూ.98లక్షలు)కు అమ్ముడుపోయింది. అదే ధరకు మరో ‘కమెడియన్’ను కూడా తర్వాత విక్రయించారు. ఆ తర్వాత దీని రూపకర్త కాటెలాన్ ఈ ఆర్ట్వర్క్ ధరను 1,50,000 డాలర్లకు పెంచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట