BarkAir: బార్క్ ఎయిర్.. ఈ విమానం కేవలం శునకాలకే
BarkAir: శునకాల కోసం బార్క్ఎయిర్ అనే సంస్థ ప్రత్యేక విమానయాన సేవలను ప్రారంభించింది. దీంట్లో వాటికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. ధర మాత్రం కాస్త ఎక్కువే. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
BarkAir | ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు శునకాలతో విమాన ప్రయాణమంటే పెద్ద సవాలే. అవి ఎక్కడ భయపడిపోతాయోననే ఆందోళన. పైగా విమానయాన సంస్థల ఆంక్షలు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ‘బార్క్ ఎయిర్’ (BarkAir) అనే సంస్థ సిద్ధమైంది. ప్రత్యేకంగా పెంపుడు శునకాల కోసమే విమాన సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విమానం న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్కు చేరుకుంది. మొదటి సర్వీసులోనే అన్ని టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది.
బార్క్ అనే కంపెనీ శునకాల ఆహారం, ఆటబొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటుంది. ఓ జెట్ ఛార్టర్ సర్వీస్ కంపెనీతో జట్టుకట్టి ‘బార్క్ఎయిర్’ను (BarkAir) ప్రారంభించింది. ఏప్రిల్లో తమ కొత్త సేవలను ప్రకటించింది. ప్రపంచంలో ఇలా శునకాల కోసం ఏర్పాటైన రెండో విమానయాన సంస్థ ఇది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన కే9 జెట్స్ అనే ప్రైవేటు సంస్థ ఈ సేవలను తొలిసారి ప్రారంభించింది. శునకాల అవసరాలకు అనుగుణంగా విమానంలో బార్క్ ఎయిర్ అన్ని వసతులు ఏర్పాటు చేసింది. వాటితో పాటు సంరక్షకులు కూడా ప్రయాణించొచ్చు. అయితే, ఏర్పాట్ల విషయంలో మాత్రం తొలి ప్రాధాన్యం శునకాలకే.
ఇదీ ప్రక్రియ..
ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. చెక్ ఇన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. క్యూలైన్లు, బోనుల వంటి హడావుడి ఉండదు. విమాన సిబ్బంది అక్కడి నుంచే వారి సేవలను అందిస్తారు. శునకాలకు విమానంలో ఇరుకుగా ఉండొద్దనే ఉద్దేశంతో.. విమాన సామర్థ్యం మొత్తానికి ఎప్పుడూ టికెట్ బుకింగ్ తీసుకోబోమని బార్క్ఎయిర్ వెల్లడించింది.
వసతులివే..
శునకాల కోసం విమానాల్లో ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. ప్రతీ క్యాబిన్లో మ్యూజిక్, లావెండర్ సెంట్తో కూడిన టవళ్లు, సువాసన వెదజల్లే పాత్రలు సహా అవి సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులుంటాయి. సిబ్బంది దగ్గర ‘జస్ట్ ఇన్ కేస్’ పేరిట ప్రత్యేక సంచులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అందులో వాటికి కావాల్సిన ఆహారం, కట్టేసేందుకు తాడు, మలమూత్రాల సంచులు సహా అన్నీ ఉంటాయి. మధ్యలో అవి ఆడుకునేందుకు విమానంలో అనేక బొమ్మలు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. 15 శునకాలు, ఒక్కో దానితో ఒక వ్యక్తి ప్రయాణించేలా బార్క్ఎయిర్ విమానాలను రూపొందించారు. కానీ 10 టికెట్లను మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.
ఆహారం..
శునకాలకు కావాల్సిన అహారం ఎప్పుడూ విమానంలో సిద్ధంగా ఉంటుంది. ఎక్కగానే నీళ్లు లేదా బోన్ బ్రాత్ అందజేస్తారు. విమానంలో గాల్లోకి ఎగిరేటప్పుడు, దిగేటప్పుడు అసౌకర్యానికి గురికాకుండా వాటికి ప్రత్యేక స్నాక్స్ అందజేస్తారు. ప్రయాణంలోనూ చాక్లెట్లు, బిస్కెట్లు సహా ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తుంటారు.
జాగ్రత్తలు..
శునకాలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించి ఉండాలి. గత ఆరు నెలల్లో రేబీస్ ప్రబలంగా ఉన్న దేశాల్లో నివాసముండకూడదు. శునకాల పరిమాణం, బ్రీడ్ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, మనుషుల మధ్య ఉన్నప్పుడు శునకాలు ఎలా ప్రవర్తిస్తాయనే విషయాన్ని వాటి యజమానులు ముందే పసిగట్టాలి. తద్వారా నలుగురికి ఇబ్బంది కలిగిస్తాయని భావిస్తే మాత్రం వాటిని విమాన ప్రయాణానికి తీసుకురావొద్దని బార్క్ఎయిర్ సూచిస్తోంది. శునకంతో పాటు ఒకరు వెంట ప్రయాణించొచ్చు. ఎక్కువ మంది వెళ్లాలనుకుంటే మాత్రం కచ్చితంగా ముందుగా తెలియజేసి టికెట్ బుక్ చేసుకోవాలి.
టికెట్ ధర..
ప్రస్తుతానికి ఈ సేవలను న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ నుంచి లండన్ మధ్య నడుపుతున్నారు. త్వరలో మరిన్ని మార్గాల్లోనూ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఈ విమానాల్లో శునకాలను తీసుకెళ్లడం మాత్రం ఖరీదైన విషయమే. న్యూయార్క్ నుంచి లాస్ఏంజెల్స్ ఒక శునకం, మనిషి కేవలం వెళ్లడానికే 6,000 డాలర్లు (దాదాపు రూ.4.98 లక్షలు). న్యూయార్క్ నుంచి లండన్కు ఈ మొత్తం 8,000 డాలర్ల (రూ.6.65 లక్షలు) దాకా ఉంది. గిరాకీ పుంజుకుంటున్న కొద్దీ ధరలను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే.. శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక!’
ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపు విషయంలో ఏదైనా శాంతి ఒప్పందానికి.. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని 80 దేశాలు ముక్తకంఠంతో పిలుపునిచ్చాయి. -
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. -
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
భారత్-శ్రీలంక మధ్య భూ అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చేస్తోన్న అధ్యయనం తుది దశకు చేరుకుందని తెలిపింది. -
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో పలువురు ఖైదీలు కలిసి ఇద్దరు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఓ ఈవెంట్లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. -
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
ఓటింగ్లో జరిగే అవకతవకలు, హ్యాకింగ్ను నివారించాలంటే ఈవీఎంలను ఎన్నికల వినియోగం నుంచి తొలగించాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సూచించారు. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
జీ20 సదస్సు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-కెనడా అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. దీనిపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. -
వైద్యులకు ఏఐ అండ!
ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్ లెర్నింగ్ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. -
భారత సంతతి వారితో అమెరికా ఆర్థికానికి భారీ ప్రయోజనం
అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతమే ఉన్నా.. వారివల్ల దేశార్థికానికి జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం తేల్చింది. ‘2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా 50 లక్షలకు చేరింది. -
బ్రిటన్ రాజు అధికారిక జన్మదిన వేడుకల్లో కేట్ ప్రత్యక్షం
గత కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్ యువరాణి కేట్ మిడిల్డన్ శనివారం బ్రిటన్ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్లో జరిగిన కింగ్ ఛార్లెస్ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. -
ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చైనా ప్రధాని
దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పాక్లో బక్రీద్ కానుకగా పెట్రోల్ ధర రూ.10 తగ్గింపు
నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్ అధా (బక్రీద్) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిలు (హెచ్ఎస్డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. -
ఆర్థిక నడవాలు.. పెట్టుబడులకు ఊతం
ప్రపంచస్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం (పీజీఐఐ) మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి, ఎలాంటి ఆంక్షల్లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్ రామఫోసా
సిరిల్ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. -
ఇజ్రాయెల్ ఆర్మీ కాన్వాయ్పై దాడి
దక్షిణ గాజాలో హమాస్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం ఐదుగంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్పై హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. -
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. -
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ యుద్ధ విమానాలు కూల్చివేసిన.. ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనిమిది దశాబ్దాల తర్వాత లభ్యమయ్యాయి. -
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే.. శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక!’
-
విజయవాడలో భారీ వర్షం.. పరిశీలించిన మంత్రి నారాయణ
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107