COVID19: కొవిడ్ మూలాలు బహిర్గతం చేసే బిల్లుపై బైడెన్ సంతకం
వుహాన్లో కొవిడ్ పుట్టుకపై అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు త్వరలో సమాచారం బహిర్గతం చేయనున్నాయి. ఈమేరకు బైడెన్ ఓ బిల్లుపై సంతకం చేశారు.
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్(Covid 19) మూలాలకు సంబంధించి వుహాన్ ల్యాబ్పై సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బహిర్గతం చేసే బైపార్టేషన్ (ఇరు పార్టీలు అంగీకరించిన) బిల్లుపై నేడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేశారు. దీంతో కొవిడ్ మూలాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన రహస్య సమాచారం బయటపెట్టేందుకు అవకాశం లభించింది. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్లోని సెనెట్, రిపబ్లికన్లు ఆమోదించారు. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీపై సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. అక్కడ జరిగిన పరిశోధనలతో కొవిడ్ వ్యాప్తికి ఉన్న సంబంధాలను ఈ ఇంటెలిజెన్స్ వెల్లడించే అవకాశం ఉంది. కాకపోతే వీటి వివరాలను వెల్లడించే క్రమంలో సున్నితమైన సోర్సులను, ఇంటెలిజెన్స్ సంస్థ అనుసరించిన పద్దతులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కొవిడ్ మూలాలపై భిన్నాభిప్రాయలను వెల్లడిస్తున్నాయి. చాలా సంస్థలు ల్యాబ్ నుంచి లీకైనట్లు చెబుతుంటే.. మరికొన్ని మాత్రం జంతువుల నుంచి పాకినట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో కొవిడ్ కారణంగా 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజా బిల్లుపై బైడెన్ సంతకం చేస్తూ.. ‘‘కొవిడ్ మూలాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మా ఇంటెలిజెన్స్ సంస్థలు సమీక్షిస్తాయి. వీటిల్లో వుహాన్ ల్యాబ్కు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ బిల్లును అనుసరించి మా కార్యవర్గం వీలైనంత ఎక్కువ సమాచారాన్ని బహిర్గతం చేస్తుంది. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారే సమాచారం మాత్రమే మా ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది’’ అని పేర్కొన్నారు.
కరోనా(Covid 19) వైరస్ జన్మస్థానం చైనా(china)లో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికా(USA)కు చెందిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఓ నివేదికలో పేర్కొంది. గతంలో అమెరికాకు చెందిన వివిధ డిపార్ట్మెంట్లు కొవిడ్ పుట్టుకపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా గతంలో నిర్దిష్టంగా చెప్పలేకపోయింది. కానీ, తాజాగా ఇచ్చిన 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా చైనా వైపే వేలెత్తి చూపింది. తన నెట్వర్క్లోని ల్యాబ్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దీనిని తయారు చేసింది. గతంలో అమెరికా దర్యప్తు సంస్థ ఎఫ్బీఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉంటుందని అభిప్రాయపడింది. మరోవైపు అమెరికా కాంగ్రెస్లోని రిపబ్లికన్లు కొవిడ్ పుట్టుకపై మరింత సమాచారం తెప్పించేందుకు బైడెన్ కార్యవర్గం మరిన్ని వనరులను మోహరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?