Joe Biden: ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనేనన్న బైడెన్.. తోసిపుచ్చిన హమాస్!
సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేసింది కాదని, అది మిలిటెంట్ల పనిలాగే కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
టెల్ అవీవ్: సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేయలేదని.. అది మిలిటెంట్ల పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. ఆసుపత్రిపై దాడి ఘటన తనకెంతో ఆగ్రహం కలిగించిందన్న బైడెన్.. హమాస్ మిలిటెంట్లపై పోరాడుతున్న ఇజ్రాయెల్కు అమెరికా తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, బైడెన్ చేసిన ప్రకటనపై స్పందించిన హమాస్.. అమెరికా గుడ్డిగా ఇజ్రాయెల్ వైపు మొగ్గుచూపుతోందని పేర్కొంది.
యుద్ధం వేళ.. ఇజ్రాయెల్లో అందుకే అడుగుపెట్టా! జో బైడెన్
‘గాజాలోని ఆసుపత్రిపై జరిగిన ఘటన నన్నెంతో కలచివేసింది. నాదగ్గర ఉన్న సమాచారం ఆధారంగా.. ఆ దారుణం వేరే బృందం చేసినట్లుగా కనిపిస్తోంది. అది ఇజ్రాయెల్ పని కాదు. ఆ దాడికి కారణం ఏంటనే విషయం కచ్చితంగా తెలియదు. హమాస్ మిలిటెంట్లు 1300 మందిని చంపారు. వారిలో 31 మంది అమెరికన్లు కూడా ఉన్నారు. హమాస్ మిలిటెంట్లు కొందర్ని బందీలుగా చేసుకున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దారుణాలపై అమెరికన్ పౌరులు దుఃఖిస్తున్నారు. ఈ పరిణామాలపై వారెంతో ఆందోళన చెందుతున్నారు’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
తోసిపుచ్చిన హమాస్..
గాజాలోని ఆసుపత్రిపై దాడికి ఇజ్రాయెల్ బాధ్యత కాదని అమెరికా చెప్పడాన్ని హమాస్ తోసిపుచ్చింది. అది అవాస్తవమని, కేవలం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకే అలా చెప్పిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో ఇజ్రాయెల్ వైపే అమెరిగా గుడ్డిగా మొగ్గుచూపుతోందంటూ విమర్శలు గుప్పించింది.
ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలి : ఇరాన్
హమాస్పై దాడులు జరుపుతోన్న ఇజ్రాయెల్పై చమురు నిషేధాన్ని విధించి అమలు చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హసియన్ అమీరబ్దుల్లాహియన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ రాయబారులను బహిష్కరించడం వీటికి అదనమని చెప్పారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం వేళ.. ఓఐసీ సభ్యదేశాలు అత్యవసరంగా బుధవారం నాడు సౌదీలోని జెడ్డాలో సమావేశమయ్యాయి.
ఖండించిన ఐరాస
సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ జరిపిన దాడి సమర్థించలేనిదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. తాజాగా గాజా ఆసుపత్రిపై దాడి కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తననెంతో బాధకు గురిచేసిందన్నారు. ఆ ప్రాంత భవిష్యత్తు మొత్తం అనిశ్చితిలో మునిగిపోయిందన్న గుటెరస్.. మధ్యప్రాచ్యంలో తక్షణమే మానవతావాద కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.
చర్చలు జరపాలి : పుతిన్
గాజా ఆసుపత్రిపై దాడి భయంకరమైన విపత్తు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన.. అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరిపిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రి పేలుళ్లలో వందలాది మంది చనిపోవడం, తీవ్ర గాయాలపాలవడం ఓ విపత్తుగా పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇదో సంకేతమన్న పుతిన్.. చర్చలు, సంప్రదింపులపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట