Pakistan-Afghanistan: అఫ్గాన్‌లో డ్రోన్‌ దాడుల వెనక విదేశీ శక్తి.. అంగీకరించిన పాక్‌..!

Eenadu icon
By International News Team Published : 29 Oct 2025 00:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: సరిహద్దు వెంబడి ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ (Pakistan-Afghanistan) మధ్య కొనసాగుతోన్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్గాన్‌పై డ్రోన్‌ దాడుల వెనక విదేశీ శక్తి ఉందని పాక్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. దానితో ఉన్న ఒప్పందం కారణంగా ఆ దాడులు ఆపలేమని నిస్సహాయత వ్యక్తంచేసిందని సమాచారం. ఈ మేరకు అఫ్గాన్ మీడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

పాక్ నుంచి అఫ్గాన్‌ డ్రోన్ దాడులు నిర్వహించేందుకు అనుమతించేలా ఆ దేశం (Third country)తో ఒప్పందం ఉందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్‌ (Pakistan) చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఆ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడం సాధ్యంకాదు కాబట్టి ఆ దాడుల్ని నిరోధించలేమని అంగీకరించిందని వెల్లడించింది. అయితే ఆ విదేశం పేరు మాత్రం పాక్ బయటపెట్టలేదని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇటీవల పాక్‌-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రెండువారాల క్రితం అఫ్గాన్ రాజధాని కాబుల్‌లో సంభవించిన పేలుళ్లతో అవి తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్థానీ తాలిబన్ ఫైటర్ల(TTP)కు ఆశ్రయం కల్పించేవారిపై తీవ్ర చర్యలు ఉంటాయని పాక్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది నామమాత్రమే. పాక్‌-అఫ్గాన్‌ మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం వీరి మధ్య తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో రెండోదశ చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ తరుణంలో పాక్ రహస్య ఒప్పందం గురించి బయటకు వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు