Justin Trudeau: మహిళా ఎంపీనే తోసిన ప్రధాని.. ట్రూడో చుట్టూ వివాదాలెన్నో..!
Justin Trudeau: భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే, గతంలోనూ ఆయన పలుమార్లు ఇలాంటి వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపిస్తూ దిల్లీతో ఉద్రిక్తతలను మరింత పెంచారు కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau). ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే, ట్రూడో ఇలా వివాదాల (Controversies)తో వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. భారత్ పర్యటనలో విమర్శలు.. పార్లమెంట్లో మహిళా ఎంపీని తోసేయడం ఇలా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
జీ20 సదస్సులో చేదు అనుభవాలు..
భారత్ అధ్యక్షతన ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ట్రూడో వ్యవహారశైలి అంటీ ముట్టనట్లు ఉంది. సదస్సు తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత ప్రపంచ దేశాధినేతలు రాజ్ఘాట్లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవలేదు. ఇక, ట్రూడోతో భేటీ అయిన భారత ప్రధాని మోదీ.. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని ప్రస్తావించడం ఆయనను మరింత ఇబ్బందిపెట్టింది. ఇలాంటి ప్రతికూల సమయంలో విమానంలో సాంకేతిక లోపం కారణంగా సదస్సు ముగిసినా ట్రూడో మరో రెండు రోజులు దిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వచ్చాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలు ఆయన్ని పట్టించుకోలేదని.. ఇది అవమానకరమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
నాటి భారత పర్యటనా వివాదాస్పదమే..
2018 ఫిబ్రవరిలో ట్రూడో కుటుంబం ఎనిమిది రోజుల పాటు భారత్లో పర్యటించింది. అయితే, ఆ సమయంలో ట్రూడో భారీగా విమర్శల పాలయ్యారు. అప్పట్లో ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్ను ఆహ్వానించారు. ఇది ట్రూడోను దౌత్యపరమైన చిక్కుల్లోకి నెట్టింది. ఈ ఘటనల కారణంగా భారత్ ప్రభుత్వం అప్పట్లో ఆయన పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అధికారిక కార్యక్రమాలు తక్కువగా జరిగాయి. పర్యటక ప్రాంతాల సందర్శన కోసం ట్రూడో భారత్ వెళ్లినట్లుందని స్వదేశంలో విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇక, ఆ పర్యటనలో ఆయన ఎక్కువ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కన్పించారు. భారత అధికారులతో సమావేశాల సమయంలో ఆయన కుర్తా పైజామాలో కన్పించడం విమర్శలకు దారితీసింది. కెనడాలో సిక్కు ఓటర్ల కోసమే ఆయన అలా ప్రవర్తించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.
నైతిక చట్టాలను పక్కనబెట్టి..
2019లో ట్రూడో ప్రభుత్వం నైతిక చట్టాలను ఉల్లంఘించిందని కెనడా స్వతంత్ర ఎథిక్స్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. 2018లో ఎన్ఎన్సీ లవాలిన్ అనే నిర్మాణ సంస్థపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ గ్రూప్పై దర్యాప్తు చేపట్టాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు నిర్ణయించారు. అయితే ఈ దర్యాప్తును ట్రూడో ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఎథిక్స్ కమిషన్ తమ నివేదికలో వెల్లడించింది. దీన్నీ ట్రూడో కూడా అంగీకరించారు. అయితే వేలాది ఉద్యోగాలను కాపాడేందుకే తాను ఆ పని చేసినట్లు చెబుతూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. నైతిక చట్టాలను ఉల్లంఘించారని నిర్ధారణ అయిన తొలి కెనడా ప్రధాని ఈయనే కావడం గమనార్హం.
ప్రైవేటు దీవిలో వెకేషన్..
2016లో ప్రముఖ బిలియనీర్ ఆగా ఖాన్కు చెందిన ఓ ఎక్స్క్లూజివ్ దీవిలో ట్రూడో వెకేషన్కు వెళ్లారు. అయితే, సొంత ప్రయోజనాల కోసమే ఆయన అక్కడకు వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఆగా ఖాన్ ఫౌండేషన్.. ట్రూడో, ఆయన ప్రతినిధులకు లాబీ కంపెనీగా నమోదైంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణలపై స్పందించిన ట్రూడో.. భవిష్యత్తులో నిబంధనల ప్రకారమే హాలిడే ప్లాన్ చేసుకుంటానని చెప్పారు.
ఎల్బోగేట్ వివాదం..
2016లో ట్రూడో ఓసారి పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించారు. విపక్ష నేతల ఆరోపణలతో విసిగిపోయిన ట్రూడో.. ఓ ప్రతిపక్ష సభ్యుడిని పట్టుకునేందుకు తన స్థానం నుంచి వేగంగా దూసుకెళ్లారు. ఆ క్రమంలో ఓ మహిళా ఎంపీని ఆయన నెట్టేశారు. ట్రూడో మోచేయి ఆమె ఛాతిని బలంగా తాకింది. దీనిపై పలుమార్లు క్షమాపణలు తెలిపిన ట్రూడో.. ప్రపంచంలోనే అత్యంత ఒత్తిడితో పనిచేస్తున్న వ్యక్తిని తానేనంటూ చెప్పడం గమనార్హం.
ఆందోళనకారిణిపై అవమానకర వ్యాఖ్యలు..
2018లో ట్రూడో ఆధ్వర్యంలో లిబరల్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. ఆ సభలో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. దేశంలో జీవన స్థితిగతులు దిగజారుతున్నాయని గళమెత్తింది. దీంతో ఆమెను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. అయితే, ఆ సమయంలో ట్రూడో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది కాస్తా వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్