China: చైనాలో మళ్లీ కొవిడ్ పంజా.. జూన్ నాటికి వారానికి 6.5కోట్ల కేసులు..!
Covid In China: చైనాలో కొవిడ్ ఉద్ధృతి మళ్లీ మొదలైంది. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి ఈ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరి వారానికి 6.5కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
బీజింగ్: కరోనా వైరస్ (Corona Virus) పుట్టినిల్లు చైనా (China)లో మరోసారి మహమ్మారి కోరలు చాచుతోంది. కొవిడ్ కొత్త వేవ్ (Covid New Wave) కారణంగా గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి ఈ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరి వారానికి 6.5కోట్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంలో కరోనా ఉద్ధృతిపై అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
ఒమిక్రాన్ (Omicron) XBB వేరియంట్ కారణంగా చైనాలో ఏప్రిల్ నుంచి రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మే చివరి నాటికి వారానికి 4 కోట్ల కేసులు (Corona Cases) నమోదయ్యే అవకాశముందని స్థానిక వైద్య నిపుణులు చెప్పినట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక జూన్ చివరి నాటికి వారానికి 6.5కోట్ల మంది వైరస్ బారిన పడే ప్రమాదమున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. 2022 డిసెంబరులో చైనా జీరో కొవిడ్ (Zero Covid) విధానానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు వైరస్ కొత్త వేవ్లు వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో ఉద్ధృతి కనిపించడం ఇప్పుడేనని డ్రాగన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వైరస్ ఉద్ధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ను మరింత వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఒమిక్రాన్ (Omicron) XBB వేరియంట్లకు రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఉండటంతో ఈ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో XBB వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షాన్ చెప్పిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు టీకాలను తీసుకురాగా.. త్వరలోనే మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లకు (Vaccines) అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఉద్ధృతిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలున్నట్లు చైనీస్ అధికారులు చెబుతున్నారు. అయితే, వృద్ధులపై దీని ప్రభావం అధికంగా ఉండనుందని, ఆ వయసువారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత డిసెంబరులో చైనాలో జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసిన తర్వాత దాదాపు 85శాతం మంది జనాభా అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు