China: ‘అరుణాచల్’పై చైనా మొండి వాదన.. నెలలో నాలుగోసారి!
అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తోన్న మొండి వాదనలపై భారత్ దీటుగా స్పందిస్తున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం నోరు అదుపులో పెట్టుకోవడం లేదు.
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్పై మొండి వాదన చేస్తోన్న చైనా (China).. ఇటీవల మరింత నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) దీటుగా సమాధానం ఇచ్చిన తరుణంలో చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది.
‘భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదు. గతంలో అది చైనాలో భాగంగా ఉండేది. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్గా రూపొందించుకుంది’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. దీనిపై చైనా వైఖరిలో మార్పు లేదన్న మొండి వాదనను కొనసాగించారు.
ఇటీవల అరుణాచల్లో ప్రధాని మోదీ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా.. అది తమ భూభాగమేనని చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మాట్లాడటం గత నెల రోజుల్లో ఇది నాలుగోసారి. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా బదులిస్తోంది. ‘ఇది కొత్త విషయం కాదు. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా వాటిని మరింత పెంచింది. అవి మొదటినుంచీ హాస్యాస్పదంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల పేర్కొన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన సౌత్ ఏషియన్ స్టడీస్లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. వీటిపైనే చైనా మళ్లీ ఇలా స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.