China: ఆ ‘జోక్’కు మూల్యం రూ.17 కోట్లు!
చైనా సైన్యాన్ని (PLA) అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ కమెడియన్పై (Comedian) అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడు పనిచేస్తోన్న కంపెనీకి భారీ జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులను నవ్వించేందుకు ఓ చైనా (China) కమెడియన్ వేసిన ఓ జోక్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఓ షోలో చైనా సైన్యాన్ని (PLA) అవమానపరిచే విధంగా స్టాండప్ కమెడియన్ (Stand-up comedy) వేసిన జోక్పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ హాస్యనటుడు పనిచేస్తున్న కంపెనీకి చైనా ప్రభుత్వం 14.7 మిలియన్ యువాన్ల (సుమారు 2.13 మిలియన్ డాలర్లు) భారీ జరిమానాను విధించింది.
బీజింగ్లోని సెంచరీ థియేటర్లో మే 13న నిర్వహించిన ఓ కార్యక్రమంలో లీ హవోషి అనే స్టాండప్ కమెడియన్ (Comedian) ఓ ప్రదర్శన ఇచ్చాడు. అందులో భాగంగా తాను షాంఘైకి వెళ్లిన సమయంలో రెండు వీధి కుక్కలను ఎలా దత్తత తీసుకున్నాడో అని వివరిస్తూ.. చైనా సైన్యం (People’s Liberation Army) చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్ చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. చైనా సైనికులను ప్రశంసిస్తూ అధ్యక్షుడు జిన్పింగ్ 2013లో ఆ నినాదాన్ని వాడారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కమెడియన్ చెప్పిన ఆ జోక్ అసభ్యకరంగా ఉందంటూ అక్కడి సోషల్ మీడియాలో అభ్యంతరాలు మొదలయ్యాయి. దీంతో ఆ పోస్టుపై తీవ్ర చర్చ జరగడమే కాకుండా.. ప్రజలనుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కాస్త చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కూడా హాస్యనటుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో సదరు కమెడియన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తదుపరి కొన్నిరోజులపాటు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ కూడా అతడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో రంగంలోకి దిగిన బీజింగ్ కల్చరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ.. ఆ కమెడియన్ పనిచేస్తున్న మీడియా సంస్థపై దర్యాప్తునకు ఉపక్రమించింది. కమెడియన్ వేసిన జోక్ సైన్యాన్ని అవమానపరిచే విధంగా ఉందని పేర్కొన్న చైనా సాంస్కృతిక శాఖ.. సదరు కంపెనీపై 14.7 మిలియన్ యువాన్ల (సుమారు రూ.17కోట్లు) జరిమానా విధించింది. కేవలం ఇదే కాకుండా.. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే సెలబ్రిటీలు, నటులపైనా చైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.