Abdul Rauf Azhar: పాక్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ను కాపాడిన చైనా..!
జైషే ఉగ్రసంస్థ కీలక నాయకుడిని చైనా వెనకేసుకొచ్చింది. పాక్కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ను ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేసిన ప్రతిపాదనను బీజింగ్ అడ్డుకొంది.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్(Pakistan) కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్(Abdul Rauf Azhar)ను బ్లాక్ లిస్ట్లో చేర్చాలంటూ భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా(China) అడ్డుకొంది. ఐరాస(UN) భద్రతా మండలి ‘1267 ఐఎస్ఐఎల్, అల్ఖైదా ఆంక్షల జాబితా’ కింద భారత్ తీర్మానానికి అడ్డుపుల్ల వేసింది. గతంలో కూడా పాక్ ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలు విధించకుండా అడ్డుకొన్న చరిత్ర చైనాకు ఉంది. రవూఫ్ గతంలో భారత్లో జరిగిన పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. 1999లో జరిగిన ఐసీ814 విమాన హైజాక్లో కూడా ఇతన హస్తం ఉంది. దీంతోపాటు 2001లో జరిగిన పార్లమెంట్పై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ఇతడిపై అమెరికా 2010 డిసెంబర్ నుంచే ఆంక్షలు విధించింది.
గతేడాది ఆగస్టులో కూడా రవూఫ్ను ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా నిలిపివేసింది. అంతేకాదు పాక్కు చెందిన హఫీజ్ తలాహ్ సయీద్, షాహిద్ మహమ్మద్, సాజిద్ మిర్లపై ఐరాస ఆంక్షలు విధించకుండా కాపాడింది. 2022 జూన్లో పాక్కు చెందిన లష్కరే ఉగ్రసంస్థకు చెందిన అబ్దుల్ రహ్మాన్ మక్కీపై ఆంక్షల ప్రతిపాదనను అడ్డుకొంది. కానీ, భారత్, అమెరికా తీవ్రంగా ప్రయత్నించడంతో ఐరాస ఈ ఏడాది జనవరిలో మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇరు దేశాల ఒత్తిడికి చైనా తలొగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి