South China Sea: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు.. ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తల నౌకను అడ్డుకున్న చైనా
దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తలతో వెళుతున్న ప్రభుత్వ నౌకలను చైనా కోస్టుగార్డ్ నౌక అడ్డుకుంది.
మనీలా: దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం ఫిలిప్పీన్స్ (Philippine)కు చెందిన శాస్త్రవేత్తల బృందంతో ఉన్న నౌకను సైనిక హెలికాఫ్టర్తో కలిసి చైనా కోస్ట్గార్డ్ నౌక అడ్డుకుంది. దీంతో కొన్ని గంటలపాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి చెందిన ఈ నౌకలు సముద్రంలోని ఇసుక దిబ్బల ప్రాంతంలో పరిశోధనల కోసం శాస్త్రవేత్తలను తీసుకెళుతున్నట్లు ఆ దేశ ప్రతినిధి తెలిపారు. నౌకకు దగ్గరగా వచ్చి తమను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాగా, ఈ ఆరోపణలను చైనా ఖండించింది.
దక్షిణ చైనా సముద్రజలాల్లో ఉండే ఇసుక దిబ్బల ప్రాంతంలో 34 మంది ఫిలిప్పీన్స్ దేశస్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చైనా కోస్ట్గార్డ్ గుర్తించింది. వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని పలుమార్లు హెచ్చరించినట్లు చైనా అధికారి గాన్ యు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఫిలిప్పీన్స్ తోసిపుచ్చింది. ‘‘చైనా కోస్టుగార్డు మరో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. సుమారు 4 గంటల పాటు మా నౌక సమీపానికి వచ్చి హారన్ మోగిస్తూ, సైనిక హెలికాఫ్టర్తో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మా శాస్త్రవేత్తల పరిశోధనను అడ్డుకున్నారు’’ అని ఫిలిప్పీన్స్ కోస్ట్గార్డ్ ప్రతినిధి జైటర్రీలా తెలిపారు.
గత ఏడాదిగా దక్షిణ చైనా సముద్ర తీరంలో ఫిలిప్పీన్స్-చైనా మధ్య వివాదం తీవ్రమైంది. ఈనెల మొదట్లో ఇరుదేశాల కోస్ట్గార్డ్ నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మనీలాకు చెందిన నౌక స్వల్పంగా దెబ్బతింది. వరుస ఘటనల నేపథ్యంలో ఫిలిప్పీన్స్కు అమెరికా మద్దతు పలికింది. ఆ దేశ సైనికులు, విమానాలు, నౌకలపై చైనా దాడి చేస్తే సహించేది లేదని, తన వ్యూహాత్మక మిత్ర దేశానికి అండగా వస్తానని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల