Viral Post: మనసు బాగోలేదా అయితే సెలవు తీసుకోండి..
చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్ (సూపర్ మార్కెట్) వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యు డాంగ్లాయ్(Yu Donglai) తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల లీవ్ ఆఫర్ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు కోరవచ్చు. ఈ లీవ్ను మేనేజ్మెంట్ కుదరదని చెప్పడానికి వీల్లేదని షరతు కూడా విధించారు.
“ప్రతీ ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలిక పరుచుకొని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. నా విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పని చేయమని బలవంతం చేయడం అనైతికం. రోజుకు ఏడు గంటలు మాత్రమే పని చేయాలి, వారాంతాల్లో సెలవులు ఉండాలి, 30 నుంచి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. మా కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని నేను అనుకోను. మా ఉద్యోగులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది.” అని యు తెలిపారు. కాగా పాంగ్ డాంగ్ లై సూపర్మార్కెట్లో పని చేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు (రూ. 80,878). ‘అన్హ్యాపీ లీవ్’ కింద ఏడాదిలో 10 రోజుల లీవ్ను సంస్థ ఇస్తుంది. వార్షిక సెలవులకు ఇవి అదనం.
ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యు డాంగ్లాయ్ ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘ఇంత మంచి బాస్ ఉంటారా?, ఈ కార్పొరేట్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చేయాలి’ అని రాసుకొచ్చారు. “నేను నా ఉద్యోగం మానేసి పాంగ్ డాంగ్ లాయ్ మార్కెట్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆనందాన్ని, గౌరవాన్ని పొందుతానని అనుకుంటున్నాను” అంటూ మరొకరు స్పందించారు.
‘కార్యాలయాల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి’ అనే విషయంపై 2021లో చైనాలో నిర్వహించిన సర్వే ప్రకారం, 65 శాతానికి ఎక్కువ మంది కార్మికులు తమ పనిపై అసంతృప్తిగా ఉన్నారని తేలింది. తక్కువ వేతనాలు, సుదీర్ఘ పని గంటలు, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం ఉద్యోగుల్లో ప్రతికూల భావోద్వేగాలకు ప్రధాన కారణాలుగా సర్వే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్ను ఉద్దేశించి కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. -
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?