China: కెనడా హెలికాప్టర్పై నిప్పుల వర్షం కురిపించిన చైనా ఫైటర్జెట్..!
చైనా మరోసారి దక్షిణ చైనా సముద్రంలో కెనడాను కవ్వించింది. కెనడాకు చెందిన ఓ సబ్ మెరైన్ హంటింగ్ హెలికాప్టర్ను వేధించింది. ఒక దశలో నిప్పులు కురిపించింది.
ఇంటర్నెట్డెస్క్: అంతర్జాతీయ జలాల్లో చైనా విమానాలు మరోసారి కెనడాను కవ్వించే చర్యలు చేపట్టాయి. దక్షిణ చైనా సముద్రంలో కెనడాకు చెందిన ఓ సైనిక హెలికాప్టర్పై బీజింగ్ ఫైటర్ జెట్ నిప్పులను (ఫ్లేయర్లు) కురిపించింది. గత ఆదివారం ఓ ఆపరేషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు కెనడా అధికారులు వెల్లడించినట్లు సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది.
‘‘ఆ స్థాయిలో నిప్పులు కురిపించడంతో అవి హెలికాప్టర్ బ్లేడ్లు లేదా ఇంజిన్కు తాకే ప్రమాదం ఉంది. ఇది ప్రమాదకరమైన చర్య’’ అని రాయల్ కెనడియన్ నేవీకి చెందిన మేజర్ రాబ్ మిల్లెన్ పేర్కొన్నారు. కెనడాకు చెందిన హెచ్ఎంసీఎస్ ఒట్టావా నౌకకు చెందిన హెలికాప్టర్పై చైనా దుశ్చర్యకు పాల్పడింది. గతంలో కూడా ఒక సారి ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది.
గాజా గగనతలంలో అమెరికా డ్రోన్లు.. బందీల కోసం గాలింపు
అక్టోబర్ 29వ తేదీన కెనడా నౌక అంతర్జాతీయ జలాల్లో ఉండగా.. దానికి సంబంధించిన హెలికాప్టర్పైకి చైనా నేవీకి చెందిన జె-11 విమానం దూసుకొచ్చింది. ఈ రెండింటి మధ్య కేవలం 100 అడుగుల దూరం మాత్రమే ఉందని కెనడా అధికారులు వివరించారు. కెనడాకు చెందిన హెలికాప్టర్ సబ్మెరైన్ల గాలింపు ఆపరేషన్లో ఉండగా దక్షిణ చైనా సముద్రంలోని పరాసల్ ద్వీప సమూహానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. ఇటువంటి అవాంతరాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే అంశంపై తమ సిబ్బందికి తగిన శిక్షణ ఉందని కెనడా అధికారి వెల్లడించారు. తమ హెలికాప్టర్ అంతర్జాతీయ జలాలపైనే ఎగిరిందని పేర్కొన్నారు.
ఇటీవల దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ స్ట్రాటజిక్ బాంబర్కు అత్యంత సమీపం నుంచి చైనా యుద్ధ విమానం ప్రయాణించిందని అమెరికా వెల్లడించింది. చైనా పైలట్ చర్య రెండు విమానాలను ప్రమాదంలోకి నెట్టిందని దుయ్యబట్టింది. ఈ ఘటనపై యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ‘‘రాత్రి సమయంలో జే-11 యుద్ధ విమానం.. అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన విమానానికి అత్యంత దగ్గరగా ప్రయాణించింది. మా బీ-52 స్ట్రాటజిక్ బాంబర్కు కేవలం 10 అడుగుల దూరం లోపలే అనియంత్రిత వేగంతో కిందకు, ముందుకు వెళ్తూ కన్పించింది’’ అని అమెరికా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ