US-India: భారత్తో బంధం చాలా అవసరం.. ఇండో-పసిఫిక్ సుస్థిరతపై అమెరికా
US-India: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అక్కడి సెనెట్ కమిటీకి వివరించారు.
వాషింగ్టన్: భారత్తో బలమైన బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ (Lloyd Austin) మరోసారి నొక్కిచెప్పారు. ఇండో-పసిఫిక్ (Indo-Pacific) ప్రాంతంలో సుస్థిరతకు భారత్ చాలా అవసరమని ఉద్ఘాటించారు. అందుకనుగుణంగా ఇండియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించాలని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీకి వివరించారు. ఈ మేరకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను వారి ముందుంచారు.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం గురించి కమిటీకి ఆస్టిన్ (Lloyd Austin) తెలిపారు. హిందూ మహా సముద్రంలో భద్రత కోసం సంయుక్త సైనిక విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి సహా ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కలిసి చేస్తున్న ప్రయత్నాలకు దన్ను లభిస్తోందన్నారు.
స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ (Indo-Pacific) నిర్మాణానికి భారత్-అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా కీలకమని కమాండర్ అడ్మిరల్ జాన్ సి అక్విలినో సెనెట్ చట్టసభ్యులకు వివరించారు. ఈ మేరకు ఎయిర్ డొమైన్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండోళ్లకోసారి జరిగే ఏరో ఇండియాలో అమెరికా బీ-1బీ బాంబర్ విమానాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు ‘కోప్ ఇండియా’లోనూ అగ్రరాజ్యం భాగస్వామ్యమవుతోందని అక్విలినో వివరించారు. టైగర్ ట్రయంఫ్ పేరిట భారీ విన్యాసాలనూ చేపట్టినట్లు గుర్తుచేశారు.
భారత షిప్యార్డుల్లో అమెరికా నౌకల మరమ్మతులు సహా హిందూ మహాసముద్రంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు అక్విలినో చెప్పారు. ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్’ కింద వీటిని చేపట్టనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?