pakistan: సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసతో దద్దరిల్లిపోతోంది. ఇటీవల ఆందోళనకారులు ఓ పోలీస్పై మూకదాడి చేసి హత్య చేశారు. అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీసు అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో ఏకే-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. తక్షణమే ఇక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం 2,300 కోట్ల పాకిస్థానీ రూపాయిలను విడుదల చేసినా.. పరిస్థితి అదుపులోకి రావడంలేదు.
స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.
ఇటీవల పీవోకేలో ఉద్యమకారుడు అంజాద్ అయుబ్ మిర్జా మాట్లాడుతూ నిరాయుధులైన ప్రజలపై బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. పొరుగు దేశం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ‘‘ఇక్కడ పరిస్థితి చేజారిపోయింది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం కల్పించాలి’’ అని డిమాండ్ చేశారు.
మంగ్లా డ్యామ్లో పాక్ దోపిడీ..
1967లో జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించారు. ఇక్కడ భారీ హైడ్రోపవర్ ప్లాంట్ ఉంది. 1975 నాటికే డ్యామ్ నిర్మాణ ఖర్చులు వచ్చేశాయి. ఒక్క 2010లోనే ఇక్కడ 250 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థానిక ప్రభుత్వానికి నయాపైసా కూడా ఇవ్వదు. మీర్పుర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకొని ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ భూముల్లో వాస్తవానికి స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకొనేవారు. డ్యామ్లో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్తు తయారవుతుండగా.. వీటిల్లో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ ఇక్కడి ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ, ఇక్కడి నుంచి పాక్ పంజాబ్లోకి విద్యుత్తు తరలించడం మొదలు పెట్టింది. వాస్తవానికి అక్కడి పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలు ప్రతి యూనిట్పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది.
పీవోకేలో ఏటా 20 లక్షల వృక్షాలను నరికేసి పాకిస్థాన్ తరలించి విక్రయిస్తారని పరిశోధకుడు డాక్టర్ షబ్బీర్చౌధ్రీ వెల్లడించారు. ఫలితంగా స్థానికంగా మట్టిపెళ్లలు విరిగిపడటం, వరదలు రావడం వంటివి పెరిగాయి. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వన మూలికలను పండిస్తారు. వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకొని సొమ్ము చేసుకొంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రికార్డులు లేవు. ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. ఇక్కడి నుంచి పాకిస్థాన్ దాదాపు 40 బిలియన్ డాలర్లకు పైగా విలువైన రత్నాలను వెలికి తీసి విక్రయించుకొంది. ఈ ప్రాంతాన్ని ఈ స్థాయిలో దోచుకొన్న ఇస్లామాబాద్ స్థానికంగా మంచినీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు. మురికినీరు తాగి ఇక్కడ ఏటా వేలమంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ ఆగడాలతో విసిగిపోయినా స్థానికులు తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు.
భారత ఎఫెక్ట్..
పుల్వామా దాడి తర్వాత పాక్ నుంచి వచ్చే ఎండు ఫలాలు, రాతి ఉప్పు, సిమెంట్, జిప్సమ్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని న్యూదిల్లీ 200శాతం పెంచింది. ఫలితంగా పాక్ నుంచి దిగుమతులు పడిపోయాయి. 2019 తర్వాత కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో పాక్ పూర్తిగా వాణిజ్యాన్నే నిలిపివేసింది. ఆ ఆర్థిక ఒత్తిడి ఇస్లామాబాద్ మీదుగా పీవోకే పై పరోక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?