Sweeteners: కృత్రిమ తీపి పదార్థాలు బరువు తగ్గిస్తాయా..? WHO ఏమందంటే..!
బరువు నియంత్రణలో కృత్రిమ తీపి పదార్థాలతో దీర్ఘకాలంలో ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. పైగా వాటితో.. టైప్- 2 మధుమేహం, గుండె జబ్బుల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.
జెనీవా: కేలరీలు ఉండవని.. తద్వారా బరువు నియంత్రణ (Weight Control)కు సహాయపడతాయని భావిస్తూ కొంతమంది చక్కెర (Sugar)కు బదులుగా కృత్రిమ తీపి పదార్థాల (Non Sugar Sweeteners)ను వాడుతుంటారు. అయితే, బరువు నియంత్రణలో వాటితో ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో కృత్రిమ తీపి పదార్థాలను వినియోగించవద్దని తన తాజా సిఫార్సుల్లో (WHO Guidelines On NSS) పేర్కొంది.
ఆస్పర్టేమ్, నియోటేమ్, శాకరిన్, సుక్రలోజ్ వంటి వివిధ కృత్రిమ తీపి పదార్థాలను ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, పానీయాల్లో ఉపయోగిస్తారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా వీటిని విడిగా కూడా విక్రయిస్తారు. అయితే, పెద్దలు, చిన్నారుల్లో బరువు నియంత్రణలో ఈ కృత్రిమ తీపి పదార్థాలు ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించవని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. పైగా.. వాటి ఉపయోగం వల్ల టైప్-2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు, పెద్దల్లో మరణాల ముప్పు వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.
‘ఎటువంటి పోషకాలు ఉండవు..’
‘సాధారణ తీపి పదార్థాలకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను వినియోగించడం.. దీర్ఘకాలంలో బరువు నియంత్రణలో సహాయపడదు. బదులుగా.. సహజమైన చక్కెరతో కూడిన పండ్లు, తీపి లేని ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం వంటి ఇతర మార్గాలను అనుసరించాలి’ అని డబ్ల్యూహెచ్వో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బ్రాంకా సూచించారు. కృత్రిమ తీపి పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం కాదని, పైగా వాటిలో ఎటువంటి పోషకాలు ఉండవని తెలిపారు. ఆరోగ్యంగా ఉండేందుకుగానూ చిన్నప్పటినుంచే తక్కువ తీపి తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
అయితే, ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నవారికి మినహా మిగతావారికి ఈ సిఫార్సు వర్తిస్తుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ‘మందులు, స్కిన్ క్రీమ్స్ వంటి ఉత్పత్తుల్లో ఎన్ఎస్ఎస్ను ఉపయోగించవచ్చు. తక్కువ కేలరీలు ఉండే తీపి పదార్థాలు, షుగర్ ఆల్కహాళ్లకు కూడా ఈ సిఫార్సు వర్తించదు. ఇవన్నీ కేలరీలు ఉండే తీపి పదార్థాలు కాబట్టి.. కృత్రిమ తీపి పదార్థాల పరిధిలోకి రావు’ అని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అసాంక్రమిక వ్యాధుల ముప్పును నివారించడంతోపాటు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లలో భాగంగా తాజా సిఫార్సులు జారీ చేసినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM