44 ఏళ్ల నాటి మాజీ ప్రధాని భుట్టో ఉరిశిక్ష కేసు.. నేడు పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తాను నియమించిన సైనికాధికారి ప్రమేయం వల్లే పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో (Zulfikar Bhutto) ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయనకు పడిన మరణశిక్షపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇస్లామాబాద్: నాలుగు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో (Zulfikar Bhutto)కు విధించిన మరణశిక్షపై బుధవారం పాకిస్థాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ హత్య కుట్ర కేసులో జుల్ఫీకర్ భుట్టో దోషిగా తేలడంతో.. 1979లో ఆయన్ను ఉరితీశారు. ఆ కేసులో న్యాయ విచారణ సక్రమంగా జరగలేదని తాజాగా కోర్టు వెల్లడించింది. దీనిపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా వెల్లడించారు.
అప్పటి సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ ప్రమేయంతోనే ఈ ఉరిశిక్ష అమలైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన 32 ఏళ్ల తర్వాత 2011లో అప్పటి అధికార ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ’ ప్రభుత్వం.. ఈ కేసును తిరిగి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ దీనికి అనుమతించారు. చివరిసారి 2012 జనవరిలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి నేతృత్వంలోని 11 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఈ కేసును విచారించిన అనంతరం పక్కన పెట్టింది. అయితే గత ఏడాది ఈ కేసు విచారణ ప్రక్రియ పునఃప్రారంభమైంది. జుల్ఫీకర్ మనవడు, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అభ్యర్థన మేరకు ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘ఈ మాటలు వినడానికి మాకు మూడు తరాలు పట్టింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాను నియమించిన సైనికాధికారి చేతుల్లోనే..!
జుల్ఫీకర్ అలీ భుట్టో పాకిస్థాన్లోని అప్రజాస్వామిక శక్తులకు వ్యతిరేకంగా నిలిచారు. 1971-73 వరకు దేశాధ్యక్షుడిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జుల్ఫీకర్ అలీ భుట్టో.. చివరకు తాను నియమించిన మిలిటరీ చీఫ్ చేతుల్లోనే మరణించారు. భుట్టో హయాంలోనే పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. భారత్తో సిమ్లా ఒప్పందం చేసుకున్న జుల్ఫీకర్పై.. తాను నియమించిన మిలిటరీ చీఫ్ జియా ఉల్హక్ 1977లో తిరుగుబాటు చేశాడు. తర్వాత ఆయనపై హత్య కుట్ర కేసు, మార్షల్ లా కింద కేసులు పెట్టారు. ఈక్రమంలోనే భుట్టోకు ఉరి శిక్ష పడింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎవరెంత ఒత్తిడి చేసినా కనికరించని జియా ఉల్ హక్ 1979లో భుట్టోను ఉరి తీయించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.