Ukraine Crisis: ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య!
ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత వోల్నోవొకాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కొందరు దుండగులు హత్య చేశారు. దీనిపై ఇరుదేశాల అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: రష్యాతో (Russia) యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో (Ukraine) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రష్యా ఆక్రమిత వోల్నోవొకా పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన.. ఉక్రెయిన్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యాకు చెందిన సైనికులే ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యా సైనికుల దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు బాధిత కుటుంబం నివసిస్తున్న ఇంటికి వచ్చి.. వెంటనే ఖాళీ చేసి ఇంటిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారని, కుటుంబ పెద్ద తిరస్కరించడంతో కాల్పులు జరిపి అందర్నీ హతమార్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఇరుదేశాల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రష్యన్ దర్యాప్తు అధికారులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని రష్యా తూర్పు భాగం నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశం ఫొటోని దొనెట్స్క్ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘నిద్రిస్తున్న కుటుంబంపై కాల్పులు జరిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ రష్యా సైనికులు డిమాండ్ చేశారని, అందుకు తిరస్కరించడంతో కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
యుద్ధ నిబంధనలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా ఘటనలపై ముందస్తు విచారణ ప్రారంభించినట్లు ఉక్రేనియన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. తాజా ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు విభాగానికి అప్పగించినట్లు వెల్లడించింది. మరోవైపు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యా దళాల దాడులను ఉక్రేనియన్ బలగాలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోని కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని ఉక్రెయిన్ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం